DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తృణమూల్ ఎంపీ నుస్రత్ కి రైల్వే మంత్రి వైష్ణవ్ గట్టి షాక్ 

*భారత్ నేల బులెట్ రైళ్లకు సూట్ కాదు, బికాం ఎంపీ*

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnam)*

*విశాఖపట్నం, మార్చి 26, 2022 (డిఎన్ఎస్):* ప్రజలను మోసం చేసే పార్టీ భారతీయ ఇంజనీర్ల విజ్ఞానాన్ని తప్పు పెట్టె అర్హత లేదని కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ మండిపడ్డారు. ఈ నెల 18 న పార్లమెంట్ లో జరిగిన సమావేశాల్లో తృణమూల్

కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ తన ప్రసంగం లో భారతదేశంలో తన కలల ప్రాజెక్ట్ బుల్లెట్ రైలు భారతీయ నేలపై తిరిగేందుకు అర్హతలేదని, దీనిపై కేంద్రాన్ని "బ్లఫ్" అని పిలిచారు.
ఆమె తన ప్రసంగంలో జపాన్‌లో ఉన్న నెల భారత దేశంలోని నేల సమానం కానందున దేశంలో ఈ ప్రాజెక్ట్ సాధ్యం కాదన్నారు. 

వెంటనే రైల్వే మంత్రి

స్పందిస్తూ మా, మాటి, మనుష్ అనే నినాదం ఉన్న త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఎంపీ భారత నేలను అవమానించినందుకు ఆమెను తప్పు పట్టారు.  ఆమెకు భారత మాతపై, భారతీయ ఇంజనీర్ల పై గౌరవం లేదని, మంత్రి మండిపడ్డారు. 

భారతదేశంలో జపాన్ వంటి బుల్లెట్ రైళ్లను నడపాలని కలలు కనడం దేశానికి హాస్పస్పదం అనే విధంగా

వ్యాఖ్యానించారు.  అలాంటి రైల్వే ట్రాక్‌లను నేలపై ఏర్పాటు చేసే సామర్థ్యం భారత నేలకు లేదన్నారు. 

అంతేకాకుండా, వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, “భారతదేశంలో బుల్లెట్ రైలును నడపడంలో మాకు సాంకేతిక సవాళ్లు ఉన్నాయని వారు చెప్పి ఉంటే, నేను వారికి సాంకేతికతలను వివరించాను. కానీ భారతదేశ సమగ్రత మరియు సూత్రాలను

ఇలా ప్రశ్నించడం నాతో సహా ఏ భారతీయుడికి ఆమోదయోగ్యం కాదన్నారు.

కాగా మంత్రి  వైష్ణవ్ ఐఐటి నుంచి ఎం టెక్ చేశారు, పైగా ఆయన సీమెన్స్ సంస్థ లో లోకోమోటివ్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్ గా కూడా విధులు నిర్వహించారు.  నుస్రత్ జహాన్ బి కామ్ చదివారు. సాంకేతిక పరంగా ఎంతో అనుభవం కూడా ఉన్న వైష్ణవ్ కి ఎంపీ కొత్త విషయాలు

చెప్పడం గమనార్హం. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam