DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రూ.1 కాసులిచ్చాడు. . రూ. 2 లక్షల ఖరీదు బైక్ కొన్నాడు 

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnam)*

*విశాఖపట్నం, మార్చి 29, 2022 (డిఎన్ఎస్):* బైక్ కొనాలి అనేది చాలామంది కల. అయితే దాన్ని నెరవేర్చుకునే విధానాలే వేరుగా ఉంటాయి. తమిళనాడు లోని ఓ యువకుడు కూడా బైక్ కొనాలి అనుకున్నాడు. అయితే ఆ బైక్ ఖరీదు రూ. 2 లక్షల విలువ ఉంది. దాన్ని తన సొంతం చేసుకునేందుకు కేవలం రూ. 1 కాసులు ఇచ్చే కొనాలి

అనుకున్నాడు. దీనికోసం గత మూడున్నరేళ్ల నుంచి రూపాయి కాసులు పోగు చేసి ఆఖరికి తన కోరిక తీర్చుకున్నాడు. 

వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన బూబతి అనే యువకుడు బిసిఎ గ్రాడ్యుయేట్ ఓ యూట్యూబ్ ఛానెల్‌ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో తన డ్రీమ్ బైక్ కొత్త బజాజ్ డామినార్ బైక్ కొనాలనుకుని

మూడేళ్ల నుంచే రూపాయి నాణేలను సేకరించి తన కిడ్డీ బ్యాంకులో వేస్తూ వచ్చాడు.

అలా రూ.2 లక్షలపైగా పోగైన చిల్లర నాణేలతో ఇతను బైక్ షోరూంకు వెళ్లాడు. తన వద్ద ఉన్న చిల్లరతో బైక్ కావాలంటూ షోరూం మేనేజర్ కు వివరించాడు. సానుకూలంగా స్పందించిన మేనేజర్ అతని వద్ద ఉన్న చిల్లరను లెక్కబెట్టేందుకు ప్రయత్నించారు. ఆ చిల్లర

నాణేలను లెక్కబెట్టేందుకు సిబ్బందికి దాదాపు 10 గంటల సమయం పట్టందట. ఆపసోపాలు పడి చివరికి రూ.2  లక్షల మొత్తాన్ని లెక్కబెట్టారు. 

ఇక మొత్తానికి అనుకున్నట్లుగానే బూబతి తన డ్రీమ్ బైక్ అయిన కొత్త బజాజ్ డామినార్ బైక్ ను కొని తన కోరికను తీర్చుకున్నాడు. ఇటీవల తమిళనాడులో జరిగిన ఈ ఘటన అన్ని ప్రాంతాల్లోనూ

చర్చనీయాంశంగా మారింది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam