DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తెలుగు ప్రజా గుండె చప్పుళ్లను ప్రపంచానికి వినిపించిన రోజు

*తెలుగు వారి ఆత్మాభిమానానికి ప్రతిరూపం: తెలుగు శక్తి బివి రామ్*

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnam)*

*విశాఖపట్నం, మార్చి 29, 2022 (డిఎన్ఎస్):* తెలుగు ప్రజల గుండె చప్పుళ్లను ప్రపంచానికి వినిపించిన రోజు ఈ రోజు అని  తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ అన్నారు.  మంగళవారం తెలుగుదేశం పార్టీ 40 వ ఆవిర్భావ

దినోత్సవాన్ని విశాఖ బీచ్ రోడ్ లో ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన ఉదయం పూలమాల వేసి నివాళులర్పించారు.  
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  తెలుగుదేశం పార్టీ  ప్రజల మనోభావాలనుంచి ఆవిర్భవించిన పార్టీ అని ఆ ప్రభంజనాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదన్నారు. ఇది కేవలం విరామమే తప్ప, విశ్రాంతి కాదన్నారు.  

వైయస్

జగన్మోహన్ రెడ్డి 2010లో పార్టీని పెట్టి 2019లో అధికారంలోకి వచ్చారన్నారు. అంటే దాదాపు తొమ్మిదేళ్ల పాటు తర్వాత అధికారం వచ్చిందన్నారు. కానీ నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి ప్రపంచ రికార్డు సాధించారన్నారు.   తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన అన్న నందమూరి తారక రామారావు

ప్రేరణతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మూలస్థంభాలు గా నిలిచి 2024 నాటికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు వస్తారన్నారు. ముఖ్యమంత్రి    వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, ఇదే క్రమంలో 2024 ఎన్నికల నాటికి జగన్ను సాగనంపి రాష్ట్ర పగ్గాలను చంద్రబాబుకు అప్పగిస్తారని జోస్యం

చెప్పారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడును ఇబ్బందులు పెట్టేందుకు జగన్మోహన్రెడ్డి ప్రయత్నించినా సాధ్యం కాదని ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వై.యస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడుని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు అన్నారు. రాజశేఖర్ రెడ్డి కి సాధ్యం కాని పనులు జగన్

మోహన్ రెడ్డి వల్ల కూడా కావని ఎద్దేవా చేశారు.

ఈ కార్యక్రమంలో కోడె బాబురావు, కె.రమేష్ బాబు, జగదాంబ మరియు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam