DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజాసింగ్ చే ఏప్రిల్ 10 న భారీ రామనవమి శోభాయాత్ర 

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnam)*

*విశాఖపట్నం, మార్చి 29, 2022 (డిఎన్ఎస్):* శ్రీరామ నవమి పర్వదినోత్సవాలను పురస్కరించుకుని ఏప్రిల్ 10 న భాగ్యనగరం లోని ఆకాశపురి హనుమాన్ ఆలయం నుంచి ఉదయం 10:30 గంటలకు భారీ శోభాయాత్ర నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే రాజాసింగ్ తెలియచేస్తున్నారు. 
 
ప్రతి ఏడాది అత్యంత వైభవంగా జరిగే ఈ

శోభాయాత్రలో పాల్గొనే వాలంటీర్లకు శిక్షణ శిబిరం ఏప్రిల్ 3 వ తేదీ అదే వేదిక వద్ద సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ యాత్రలో వాలంటీర్లు గా పాల్గొనేవారు తమ వెంట ఆధార్ కార్డు నకలు, పాస్ పోర్ట్ సైజు ఫోటోలు తీసుకురావాలని సూచించారు. 

ప్రతి ఏడాది రామ నవమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని, జాతి,

మత సంప్రదాయాలకు అతీతంగా ఎందరో ప్రజలు ఈ యాత్రలో పాల్గొంటారని, ఈ యాత్ర దేశ ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనేందుకు ఈ యాత్రలో వేలాది మంది భక్తులు కార్యకర్తలుగా సేవలు అందిస్తూరన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam