DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జిల్లాల నుంచే పనిచేయాలి, టి బీజేపీకి జాతీయ కమిటీ ఆదేశాలు

*రాష్ట్ర కమిటీ మీటింగ్ లో బిజెపి ప్రధాన కార్యదర్శి సంతోష్ జీ*

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Hyderabad/ Vizag)*

*విశాఖపట్నం, మార్చి 29, 2022 (డిఎన్ఎస్):* రానున్న ఎన్నికల్లో తెలంగాణ లో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న భారతీయ జనతా పార్టీ టి బీజేపీ లో కఠిన ఆంక్షలు అమలు కై సిద్దపడింది. మంగళవారం జరిగిన టి బీజేపీ రాష్ట్ర

పదాధికారులు, జిల్లా ఇంచార్జీలు, జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహించడం జరిగింది. టి బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బిజెపి జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి బి.ఎల్ సంతోష్ జీ పాల్గొన్నారు. 

క్షేత్ర స్థాయి నుంచి పార్టీ ని బలోపేతం చెయ్యడం కోసమే జిల్లా స్థాయిలో పూర్తి కమిటీలను

వేశామని, నేతలు జిల్లా కేంద్రాల్లోనే కచ్చితంగా ఉండాలని, లేనిపక్షంలో బయటకు వెళ్ళవచ్చు అంటూ కేంద్ర బీజేపీ సంకేతాలు ఇచ్చేసింది. అధికశాతం జిల్లా నేతలు రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలోని  ఉండి, కార్యాచరణ తూతూ గా నౌదుపుతున్నారంటూ కేంద్రానికి సమాచారం అందిన నేపథ్యంలో సంతోష్ జి పూర్తి స్థాయి సమావేశాన్ని చేపట్టినట్టు

తెలుస్తోంది. 
పార్టీలో త్వరలోనే మరిన్ని చేరికలు ఉంటాయని, తద్వారా, నేతలు అందరిని కలుపుకుంటూ వెళ్లాలని, లేదంటే కుదరదని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. పార్టీ ని అధికారంలోకి తీసుకురావాలంటే ఉత్తర ప్రదేశ్ లో అమలు చేసిన ప్రణాళిక అమలుచెయ్యాల్సిందేనని సంకేతాలు ఇచ్చారు. 

ఈ భేటీలో కేంద్రమంత్రి జి. కిషన్

రెడ్డి, బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బిజెపి మధ్యప్రదేశ్ ఇంచార్జ్ మురళీధర్ రావు, తమిళనాడు రాష్ట్ర సహ ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, శాసనసభా పక్ష నేత రాజాసింగ్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, గరికపాటి మోహన్ రావు, జితేందర్ రెడ్డి, విజయశాంతి  తదితరులు

పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam