DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రామాలయం వద్ద క్రైస్తవ ప్రార్ధనల పై మంత్రి ని నిలదీసిన విహెచ్పి

*మంత్రి చెల్లుబోయినను నిలదీత, అబ్బె ఏ సమస్య లేదు: మంత్రి* 

*(DNS Report : Sairam CVS, Bureau Chief,  Visakhapatnam)*

*విశాఖపట్నం, ఏప్రిల్ 01 , 2022 (డిఎన్ఎస్):* తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం పరిధుల్ని K.గంగవరం మండలం గంగవరం గ్రామంలో రామాలయం వద్ద జరిగిన క్రైస్తవ ప్రార్థనలు నిర్వహించటం పై విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్

కార్యకర్తలు రంగం లోకి దిగారు. దుర్ఘటన జరిగిన స్థలానికి భారీ ఎత్తున హిందూ సంఘాలు, కార్యకర్తలు చేరుకొని, జరిగిన విషయాన్నీ ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఇదే సమయంలో మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ రావడంతో విహెచ్పి, భజరంగ్ దళ్ కార్యకర్తలు, నేతలు మంత్రిని ఈ అంశంపై నిలదీశారు. ఆయనకు ఏమి చెప్పాలో తెలియక విషమ

పరిస్థితుల్లో  చమత్కార మాటలతో ఏ సమస్యా లేదు అని సర్ది చెప్పే ప్రయత్నం చేసినట్టు రామచంద్రపురం విహెచ్పి రాష్ట్ర సహా ప్రముఖ్  శిరంగు నాయుడు తెలియచేసారు. 

అదే క్రమం లో రామాలయ ప్రాంగణంలో  ఈ క్రైస్తవ కూటమి దుర్ఘటన ను అడ్డుకున్న స్థానిక యువకుడి పై దిశా చట్టం ప్రకారం రేప్ కేసు పెట్టారని వార్తలు వచ్చిన

అంశాన్ని పొలిసు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లగా, అతనికి పై ఎటువంటి కేసు పెట్టమని డిఎస్పీ, సిఐ, ఎస్ఐ లు హామీ ఇచ్చినట్టు శిరంగు నాయుడు తెలిపారు. దీంతో స్థానిక క్రైస్తవులు రామాలయం ప్రాంగణంలో ఎటువంటి మత ప్రార్థనలు చేయం అని వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రాజి కి వచ్చి, ఎవ్వరిపై ఏటువంటి కేసులు పెట్టవద్దు అని ఒక ముగింపు

పలకడం జరిగిందని తెలిపారు.  

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రముఖ్ కోప్పడి రాము, గన్నవరం ప్రఖండ వాశంశెట్టీ సుబ్రహ్మణ్యం కూమార్, గన్నవరం ప్రఖండ బజరంగ్ దళ్ వ్యాయామం ప్రముఖ్ దోంగ రామకృష్ణ, కాకినాడ జిల్లా ప్రముఖ్ వెంకటెశ్వరావు తదితరులు పాల్గొన్నారు
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam