DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వరాహ నృసింహుని ఆంతరంగిక భక్తునికి అగ్రతాంబూలం 

*సింహాచల క్షేత్ర ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా గంట్ల శ్రీనుబాబు*

*ప్రహ్లాద వరదుని ఆత్మీయునికి శుభాభినందనలు : DNS మీడియా*   

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, ఏప్రిల్ 06 , 2022 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు సింహాచలం క్షేత్రం లో వెలసిన ప్రహ్లాద వరద శ్రీ

వరాహాలక్ష్మీనృసింహ స్వామి కి అత్యంత ఆత్మీయునిగా సేవలందిస్తున్న గంట్ల శ్రీనుబాబు ను దేవస్థానం ట్రస్టుబోర్డు సభ్యునిగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. వీరు ఈ హోదాలో రెండేళ్ల పాటు సేవలందించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎమ్.హరిజవహర్ లాల్ జీవో నెంబర్ 235 బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ

చేశారు. 

సీనియర్ పాత్రికీయునిగా ఉన్న వీరు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గా భాద్యతలు నిర్వహిస్తున్నారు. 

ప్రస్తుతం సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా సేవలందిస్తున్నారు.  గతంలో చందనోత్సవం కమిటీ సభ్యునిగా, పలు అనుబంధ ఆలయాల

అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. దేవస్థానం అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తున్నారు. 
శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యునిగా నియమితులవ్వడం పట్ల గంట్ల శ్రీనుబాబు ను DNS మీడియా అభినందనలు తెలియచేస్తోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam