DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆలయాలు అంటే ఆగమ, అర్చక, భక్తులే. వీళ్లపై ట్రస్టీల పెత్తనమా? 

*మూలవిరాట్ పేరే తెలియని వాళ్ళకా ట్రస్టీలుగా అవకాశం?* 

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, ఏప్రిల్ 07 , 2022 (డిఎన్ఎస్):* హిందూ దేవాలయాల వ్యవస్థపై ఏమాత్రం అవగాహనా లేనివాళ్ళని ఆలయాల పాలకమండలి సభ్యులుగా నియమించడం పట్ల  హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. గత కొంత కాలం గా జరుగుతున్నా ట్రస్టీల

నియామకాల్లో ఆర్ధిక నేర చరిత్ర, పలు కేసుల్లో నిందితులుగా ఉన్నవారు కూడా ఉండడం పై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి . 

చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే. .ఆలయం లో ట్రస్టీ గా నియమించబడిన వాళ్ళల్లో చాలామందికి ఆ దేవాలయంలో ఉన్న మూలవిరాట్ పేరుగాని, ఆలయ చరిత్ర గానీ తెలియదు అంటే అతిశయోక్తి కాదు. పైగా వీరిలో

చాలామంది హైందవేతరులు సైతం హిందూ పేర్లతో చెలామణి అవుతుండడం గమనార్హం. 

ఇవి ప్రస్తుతం రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రాలుగా మారిపోయాయి. ఆలయ చరిత్ర, వైభవం, ఆగమం, ప్రాధాన్యత, అక్కడ జరిగే ప్రతి ఉత్సవం గురించిన అవగాహనా తో పాటు, పూర్తి అవగాహనా ఉన్నవారికి మాత్రమే ట్రస్టీలుగా నియమిస్తే. .ఆలయాలు వైభవాన్ని

పొందుతాయి.  

అసలు ఆలయాల్లో ట్రస్టీలతో అవసరం ఏంటి? ఆలయమే నిర్వహణలో ట్రస్టీల పాత్ర ఏంటి?

ఆలయాలు అంటే అక్కడ ప్రధాన మూల విరాట్ కు అర్చనాది ఆరాధనలు జరిగే ఆగమ  విధానం, వాటిని నిర్వహించే అర్చకులు, ఇతర సహాయక సిబ్బంది, గుళ్లను ఆదరించే భక్తులు మాత్రమే. వీళ్ళు మాత్రమే ఆలయాల లో ప్రధాన పాత్ర పోషించేది. నేటి

రాజకీయ పాలనా వ్యవహారంలో హిందూ దేవాలయం కు వచ్చే ఆదాయాన్ని దోచుకు తినేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖా అంటూ  ఒక ప్రత్యేక శాఖను కూడా ఏర్పాటు చేసారు. తద్వారా ఆదాయం వచ్చే ప్రతి దేవాలయాన్ని బలవంతంగా కబ్జా చేసి, ఆస్తులను స్వాధీనం చేసుకుని. అక్కడ టికెట్ విధానం పెట్టి, ఆలయానికి భక్తులను దూరం చేస్తున్నా దాఖలాలు ఎన్నో

ఉన్నాయి. 

ఇక ప్రతి ఆలయానికి నిర్వహణ పేరుతొ ఒక సలహా మండలి నే ఏర్పాటు చేసి, ఏమాత్రం అర్హత లేని, అవగాహన లేని వాళ్ళను ఈ సలహా మండలి లో సభ్యులుగా నియమించడం తో ఆలయ వ్యవస్థ పూర్తి గా బ్రష్టుపట్టింది. 

ఈ ఆలయాలను నిర్వహించాలిని అంటే ఆగమ విధాన పరమైన సలహాలు అర్చకులు ఇవ్వడం జరుగుతుంది. ఆదాయ వ్యయ సహకారాలు కై

విరాళాల రూపం లో భక్తుల నుంచి సహకారం లభిస్తుంది.

గత వైభవం: . .

అఖండ భారతావని ఈ మాత్రం సంతోషంగా ఉంది అంటే ఆలయాల వైభవమే ప్రధాన కారణం. స్వాతంత్య్రానికి పూర్వ కాలంలో పరిపాలన అంతా హిందూ దేవాలయాల కేంద్రంగానే సాగేది. దీనికి చారిత్రక ఆధారాలున్నాయి.  నాడు విష ప్రచార కూటాలు లేనందున సమాజం అంతా ఎంతో సమన్వయంతో

సాగేది. ప్రజలకు కావాల్సిన సంక్షేమ కార్యాచరణ అంతా దేవాలయాల్లోనే  నిర్దేశించబడేది. 

అయితే నేడు విస్తృతంగా విష ప్రచార కూటాలు, పెరిగిపోయి హిందూ ధర్మం పై విష ప్రచారం చేస్తూ. . ప్రజలను బలవంతంగా మతమార్పిళ్లు చేస్తున్నారు. దీని కి నిదర్శనంగానే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వందలాది హిందూ దేవాలయాల పై మతి తప్పిన

 మతోన్మాదులు భౌతికదాడులు చేస్తూ.. ఆలయాల ఆస్తులు ధ్వంసం చేస్తున్నా పాలకులు  కళ్ళు మూసుకు పోవడమే. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam