DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆర్భాటానికి పెట్టిన సొమ్ము ఆదివాసీలకు ఇస్తే ఉపయోగం 

విశాఖపట్నం, ఆగస్టు 08, 2018 (DNS Online ) : ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం విశాఖ మన్యం లో పెట్టిన ఆర్భాటం లో లక్షో వంతు ఆదివాసీలకు ఖర్చు చేసి ఉంటె వారికి ఎంతో

ఉపయోగం ఉండేది అనే అభిప్రాయం మన్యం వాసుల్లోనే వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని గిరిజన సంక్షేమ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యక్తం చేస్తోంది. ఈ దినోత్సవం పేరిట

స్వాగతం పలికే బోర్డింగ్లు సైతం ప్రభుత్వ ఖర్చుతోనే వేశారు అనే ఆరోపణలూ వ్యక్తమవుతున్నాయి. ఈ ఆర్భాటాలకు చేసిన ఖర్చుతో కొన్ని ఆదివాసీ కుటుంబాలకు నెలల తరబడి

అవసర ఖర్చులు తీరిపోతాయి అంటే అతిశయోక్తి కాదు. ఒకవేళ నేతలు జేబు లో ఖర్చు చేసి స్వాగత బోర్డు లు పెట్టిన, ఆ ఖర్చు ను ఆదివాసీలకు వివిధ పథకాలకు ఇచ్చిన ఉంటె వారికి

కొంత సానుకూలంగా ఉండేది. ఈ ప్రభుత్వానికి, ప్రజా ప్రతినిధులకు సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప, ఆదివాసీలకు ఉపయోగ పడే పనులు చెయ్యడం తెలియదంటూ ప్రతిపక్షాలు

మండిపడుతున్నాయి. అయినా పార్టీ చేపట్టే దొంగ దీక్షలకు ప్రభుత్వ ఖజానా నుంచి కోట్లు ఖర్చు చేస్తున్న అధికార పార్టీ నేతలకు, à°ˆ ప్రభుత్వ  à°…ధికారిక ఆదివాసీ

దినోత్సవానికి చేసే ఖర్చు తమ జేబు లో నుంచి తీసేంత ఉదార స్వభావం లేదని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. ప్రజల పక్షం గా రోజుకు 24 గంటలూ నిద్రాహారాలు లేకుండా

పనిచేస్తున్నానని చెప్పుకునే 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న à°ˆ రాష్ట్ర ముఖ్యమంత్రికి à°ˆ ఆరోపణలు తీరని అవమానంగానే చెప్పుకోవాలి.    

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam