DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీనుబాబు అనే. .నేను.. .సింహాచల క్షేత్ర ఆలయ ధర్మకర్తగా..

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, ఏప్రిల్ 07 , 2022 (డిఎన్ఎస్):* సింహాచలం క్షేత్రంలో వెలసిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి సభ్యుని గా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు ప్రమాణ స్వీకారం

చేసారు. గురువారం దేవస్థానం ప్రాంగణం లో జరిగిన కార్యక్రమం లో ఆలయ ఈవో ఎంవి సూర్యకళ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. 
అనంతరం శ్రీనుబాబు మాట్లాడుతూ సింహాచల క్షేత్రం తో తనకు చిన్న నాటి నుంచి అనుబంధం ఉందని, నేరుగా ధర్మకర్తగా స్వామికి సేవ చేసే అదృష్టం కలగడం పూర్వజన్మ సుకృతం అన్నారు. గత కొన్నేళ్లుగా ఇతరుల

పరిధిలో ఉన్న ప్రహ్లాద కల్యాణ మండపాన్ని స్వాధీనం చేసుకుంటామని, అక్కడ దేవస్థానం కార్యాచరణ చేపడతామన్నారు. మే 3 న వైశాఖ సుద్ద తదియ అక్ష తృతీయ నాటి స్వామి వారి నిజరూప దర్శనం కోసం భక్తులకు దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని. అందరూ సహకరించాలని కోరారు. అంతకు ముందు స్వామి దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వచనం

చేసారు.   

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam