DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మసీదుల్లో స్పీకర్లు ఆపకుంటే. హనుమ చాలీసా వినిపిస్తాం

*మహారాష్ట్రలో రాజ్ థాక్రే హెచ్చరికలు, అమలు లో క్యాడర్* 

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, ఏప్రిల్ 07 , 2022 (డిఎన్ఎస్):* హిందూ ధర్మ ప్రచారం కోసమే ఆవిర్భవించిన మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధినేత రాజ్ థాకరే లౌడ్ స్పీకర్ల పై చేసిన హెచ్చరికలను అమలులోకి తీసుకు వచ్చారు. 
మహారాష్ట్ర నవనిర్మాణ సేన

అధినేత రాజ్ థాకరే 2 ఏప్రిల్ 2022న ముంబైలోని శివాజీ పార్క్‌ లో తన పార్టీ వార్షిక గుడి పడ్వా సమావేశంలో ప్రసంగించారు. మసీదుల్లో లౌడ్ స్పీకర్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే మసీదుల ముందు రెట్టింపు లౌడ్ స్పీకర్లను పెట్టి హనుమాన్ చాలీసా జపం చేస్తానని రాజ్ ఠాక్రే తనదైన  శైలిలో

హెచ్చరించారు.

ముంబైలోని మురికివాడల్లోని మసీదులు, మదర్సాలను పోలీసులు సరిగ్గా తనిఖీ చేస్తే అక్రమంగా పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుండి ఎంతమంది ఇక్కడకు వచ్చి ఎంతమంది స్థిరపడ్డారో తెలుస్తాయని, అనేక విషయాలు తెలుస్తాయని ఆయన అన్నారు. 

తాను ఒకరి ప్రార్థన హక్కు కు వ్యతిరేకం కాదని,  అయితే మసీదులపై

ఉన్న లౌడ్ స్పీకర్లను తప్పనిసరిగా తొలగించాలి. వాటిని తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాన న్నారు. లేకుంటే, ఆ మసీదుల ముందు హనుమాన్ చాలీసా జపించడానికి డబుల్ లౌడ్ స్పీకర్లను ఉంచుతామన్నారు. 

లౌడ్ స్పీకర్ పెట్టమని  ఏ మతం చెప్పిందన్నారు? మీ మతం కనుగొనబడినప్పుడు ఏదైనా లౌడ్ స్పీకర్ ఉందా? అని

అడిగారు. 

ఈ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ  ఈ ప్రసంగం జరిగిన రెండో రోజే ముంబైలోని ఘాట్‌కోపర్‌లోని ఎం ఎం ఎస్ కార్యాలయం ఎదుటే మసీదు లో నుంచి అజాన్ లౌడ్ స్పీకర్లు పెట్టడంతో ఆ పార్టీ నాయకుడు మహేంద్ర బనుషాలి తమ పార్టీ కార్యాలయం బయట చెట్లపై అమర్చిన లౌడ్ స్పీకర్ల నుండి అధిక డెసిబుల్స్ వద్ద 'హనుమాన్

చాలీసా'ను ప్లే చేసారు. బయట స్పీకర్లు పెట్టడానికి అనుమతి లేదని దీన్ని ఖండిస్తూ మహారాష్ట్ర పోలీసులు మహేంద్రను అదుపులోకి తీసుకున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam