DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగన్ ఒక్క నిర్ణయం తో అసమ్మతి తెనేపుట్ట కదిలింది 

*(DNS రిపోర్ట్: పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, ఏప్రిల్ 11 , 2022  (డిఎన్ఎస్):* మంత్రి వర్గాన్ని మారుస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వలన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ లో అసమ్మతి తెనేపుట్ట మొత్తం కదిలింది. గత క్యాబినెట్ లో ఉన్న వాళ్లలో కొందరికే తిరిగి చోటు లభించడం తో మిగిలిన

వాళ్ళు అసమ్మతి తో రగిలిపోతున్నారు. పర్యవసానంగా అనుయాయులు రోడ్డెక్కి సాక్షాత్తు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిష్టి బొమ్మని దగ్ధం చేసే స్థాయికి చేరిపోయారు. మంత్రి పదవి ఇచ్చినప్పుడు పాల ను పోసిన జగన్ ఫోటో నే నేడు పదవి పోవడంతో బూడిద పాలు చేసారు. 
మూడేళ్ళ క్రితం పదవి తీసుకునే ముందే తాము కచ్చితంగా రాజీనామా చేస్తామని,

ఎటువంటి పేచీ పెట్టమని జగన్ కు వ్యక్తిగతంగా హామీలు ఇవ్వడం జరిగింది. అదే విషయాన్నీ పత్రికా ముఖంగా కూడా ప్రకటించారు. అదే మనుషులు నేడు బహిరంగంగానే అసంతృప్తి ని వ్రేళ్ళగ్రక్కుతున్నారు. దీనిపై అధిష్ఠానం సీరియస్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. 
పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రజలకు సేవ చెయ్యడానికే తప్ప. . సభ్యులు పదవులు

అనుభవించడానికి కాదు అంటూ ఇదే మనుషులు ప్రతి వేదికపై ఘంటా బజాయించి మరీ ప్రకటించారు. 
 
ఒత్తిడి లో వైఎస్ జగన్ : ఒకరిద్దరు మినహాయించి కేబినెట్ అంత కొత్త వారితో ఉంటుంది అన్నప్పుడు కూడా పరిస్థితులు జగన్ కంట్రోల్ లోనే ఉన్నాయి. కరెక్ట్ గా మంత్రులు రాజీనామా చేసిన మూడో రోజు ప్రకాశం జిల్లా లో ఓ మంత్రి ని పదవిలో

కొనసాగించే అవకాశం ఉంది అన్న లీక్ తో అదే జిల్లాకు చెందిన మరో మంత్రి రగిలిపోయాడు.
ఇదే తంతు పక్క జిల్లాలకు పాకి మంత్రివర్గ విస్తరణ గందరగోళంగా చిలికి చిలికి గాలి వాన అయినట్లు పరిస్థితులు జగన్ చేయి దాటి పోయాయి

అయితే కొత్తగా క్యాబినెట్ లోకి వచ్చిన వాళ్లలో అనుభవరాహిత్యమే అధికం. పైగా వీళ్ళలో చాలామందికి

ప్రజాబలం కూడా లేకపోవడం గమనార్హం. పార్టీ లో ప్రస్తుతం ఎన్నికైన వాళ్ళందరూ కేవలం వైఎస్ జగన్ సానుభూతితో గెలిచినా వాళ్ళే అధికశాతం ఉన్నారు. స్థానిక ప్రభావం కొంతవరకూ ఉంది తప్ప అది గెలిచేంత గా లేదు అన్నది వాళ్లకి కూడా తెలుసు. 
అయితే నేటి వైఎస్ జగన్ నిర్ణయం పార్టీ కి తీరని నష్టం చేసేది కూడా కావచ్చు అనే అభిప్రాయం

పార్టీలో సీనియర్ క్యాడర్ అభిప్రాయపడుతోంది. 

ఏపీ కేబినెట్ విస్తరణలో 8 కొత్త జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు . వీటిలో అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలు ఉన్నాయి. 
అయితే కొన్ని కొత్త జిల్లాల్లో ఒకటి కంటే ఎక్కువ మందికి మంత్రి పదవులు దక్కాయి. 
/> ఒకటి కంటే ఎక్కువ మందికి మంత్రి పదవులు దక్కిన జిల్లాలు ఇవే .. 
శ్రీకాకుళం జిల్లా - ధర్మాన ప్రసాదరావు , సీదిరి అప్పలరాజు 
కోనసీమ- చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ , పినిపె విశ్వరూప్ 
ప.గో. జిల్లా కారుమూరి వెంకట నాగేశ్వరరావు , కొట్టు సత్యనారాయణ 
పల్నాడు జిల్లా - అంబటి రాంబాబు , విడదల రజని - 
చిత్తూరు జిల్లా -

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , నారాయణ స్వామి , రోజా

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam