DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గుళ్ళపల్లి ఘనపాఠికి భారతాత్మ అశోక్ సింఘాల్ పురస్కారం 

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, ఏప్రిల్ 19 , 2022 (డిఎన్ఎస్):* శ్రీ దత్తాత్రేయ వేదవిద్యా గురుకులం వ్యవస్థాపకులు, వేదార్థచూడామణి, స్వాధ్యాయరత్న బ్రహ్మశ్రీ  గుళ్ళపల్లి సీతారామచంద్ర మూర్తి ఘనపాఠి కి ప్రతిష్టాత్మకమైన భారతాత్మ అశోక్ సింఘాల్ వైదిక పురస్కార్ లభించింది. 

సింఘాల్ ఫౌండేషన్ వారు

చిన్మయ మిషన్ (ఢిల్లీ) లో ఈ నెల 18 న నిర్వహించిన కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్  ఓం బిర్లా ఈ పురస్కారాన్ని,  ఆదర్శ వేదాధ్యాపక బిరుదును అందజేశారు. 
భారతాత్మ సింఘాల్ వైదిక పురస్కారాన్ని ఈ రంగంలో రాష్ట్రపతి అవార్డుతో సమానమైనదిగా పండితులు భావిస్తారు. ఈ అవార్డు కింద గుళ్ళపల్లివారికి రూ. ఐదులక్షల నగదు, ప్రశంసాపత్రము,

జ్ఞాపిక అందజేశారు. 

విశ్వహిందూ పరిషత్ పూర్వాధ్యక్షులైన అశోక్ సింఘాల్ జీ పేరిట ఏర్పాటైన సింఘాల్ ఫౌండేషన్ వారు దేశవ్యాప్తంగా పేరొందిన ప్రసిద్ధ వేదపండితులకు ఏటా ఈ వైదిక పురస్కారం ఇస్తున్నారు. తెలుగుప్రాంతం నుంచి ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్న తొలి వేద పండితులు వీరే కావడం తెలుగువారందరికీ

గర్వకారణం. 

ఈ కార్యక్రమంలో స్వామి గోవింద దేవ గిరీజీ, ప్రధాన మంత్రి ఆర్థిక సలహాదారుల కమిటీ అధ్యక్షులు బిబేక్ డిబ్రాయ్, దేశంలోని అనేకమంది మహామహులు, పండితవరేణ్యులు పాల్గొన్నారు.  

ఘనపాఠి గురించి : ...  

బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి సీతారామచంద్ర మూర్తి ఘనపాఠి 1966 ఫిబ్రవరి 15 వ తేదీన జన్మించారు.

వారి తండ్రి వేదతపస్వి, కాశీ పండిత బిరుదాంకితులైన గుళ్ళపల్లి ఆంజనేయ ఘనపాఠి. ఆయన రాష్ట్రపతి సమ్మానాన్ని కూడా స్వీకరించారు. సీతారామచంద్ర మూర్తి అనేక మంది గురువులు, మహనీయుల వద్ద  శ్రీకృష్ణ యజుర్వేద సలక్షణ ఘనాంతం, వేదాంగములు (షడంగ మూలములు మరియు వ్యుత్పత్తి), సంపూర్ణ విద్యారణ్య వేదభాష్యం, శాస్త్ర ప్రకరణ గ్రంథములు,

శ్రౌత స్మార్తములు, ప్రస్థానత్రయ శ్రీ శంకర భాష్యములు, గీతా, సూత్ర , ఉపనిషద్ భాష్యములు, ధర్మశాస్త్రములు అభ్యసించి, ఆమూలాగ్రమూ ఆపోసన పట్టిన మహాపండితులు. వేదవిద్యా వ్యాప్తికి జీవితాన్ని అంకితం గావించారు.

తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలోని ఆర్యాపురంలో 2000 సంవత్సరం అక్టోబర్ 29 వ తేదీన శ్రీ దత్తాత్రేయ

వేద విద్యా గురుకులాన్ని స్థాపించారు. అనతికాలంలోనే సాకారమైంది. ఈ గురుకుల కీర్తి దశదిశలా వ్యాపించింది. అంతే కాకుండా కొంతమూరు బ్రాహ్మణాగ్రహారంలో సర్వ సదుపాయాలతో కూడిన సువిశాల ప్రాంగణంగా అభివృద్ధి చెందింది. వైదిక జీవన సంప్రదాయానికి కట్టుబడి విదేశీ యాత్రలను ఆమోదించలేదు. 
శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి,

అహోబిల జీయరు స్వామి, ఇతర పీఠాధిపతులు ఈ విద్యాలయాన్ని సందర్శించారు.  

2018 లో చిన్న జీయర్ స్వామి వారి జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ జీయర్ అవార్డును వీరికి అందించింది.  

వీరికి "వేద విద్యాలంకార", “స్వాధ్యాయరత్న”, “వేదార్ధ ప్రకాశక” “వేద భాస్కర” “వేదాచార్య”,  “ఆమ్నాయవిద్వన్మణి”,

 “వేదవిద్యానిధి”  “వేదజ్యోతి”, “భారతజ్యోతి”,  “ది బెస్ట్ సిటిజెన్ ఆఫ్ ఇండియా” , “ఆమ్నాయ వాచస్పతి”, “వేదార్థ చూడామణి”, “వేదవిద్యా వాచస్పతి” వంటి బిరుదులను దేశంలోని అనేక రాష్ట్రాల్లో గల ప్రముఖ సంస్థలు ఆయనకు ప్రదానం చేసాయి.   

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam