DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మే 3 న వరాహ నృసింహుని నిజరూప దర్శనం: ట్రస్టీ శ్రీనుబాబు

*26 న సింహాద్రి క్షేత్రంలో తొలివిడత చందనం అరగతీత* 

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, ఏప్రిల్ 20 , 2022 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్త కోటి ఇలవేల్పు సింహాచలంలో వెలసిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మే 3 న అప్పన్న నిజరూప దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ

ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు తెలిపారు. 

ప్రతి ఏటా వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) నాడు శ్రీ పాంచరాత్ర ఆగమ సంప్రదాయ విధానంగా ఆలయంలో అర్చనాదికాలు జరుగుతాయని, ఆ ఒక్క రోజే భక్తులకు స్వామి వారి నిజరూప దర్శనం కూడా

లభిస్తుందన్నారు. ఏడాది లో ఒక్కసారే ఈ దర్శనం లభిస్తుందన్నారు. ఈ వేడుకలకు ఆలయ ఈవో ఎంవీ సూర్య కళ ఆధ్వర్యంలో ఘనంగా పర్యవేక్షణ  జరుగుతోందన్నారు. 

బుధవారం సింహాద్రినాధుడు ను దర్శించుకున్న అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ వేడుకల్లో అవతారిక గా ఈ నెల 26న తొలివిడత చందనం అరగతీత కార్యక్రమం వైభవంగా ప్రారంభం

కానుందన్నారు. ఏకాదశి పర్వదినం రోజున నిర్వహించే ఈ ఉత్సవాలకు సంబంధించి ఆలయ వర్గాలు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నాయన్నారు. 
ఆ రోజు తెల్లవారుజామున సింహాద్రి నాథుడు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల ను సుప్రభాత సేవతో మేల్కొలిపి ఆరాధన గావిస్తారన్నారు. అనంతరం గంగ ధార నుంచి  తీసుకొచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించి,

విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం, అనంతరం తొలి విడత గా  3 మణుగుల ( 125 కిలోలు)  చందనం అరగతీత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు.

చందనోత్సవం రోజు రాత్రికి తొలివిడత చందనం సమర్పణ గావించి, ఆ తర్వాత వచ్చే వైశాఖ, జ్యేష్ఠ, ఆషాడ పౌర్ణమిలలో మూడేసి మణుగుల చొప్పున మొత్తం ఏడాదిలో నాలుగు  విడతల  కింద 12 మణుగుల చందనాన్ని

(500కేజీలు) స్వామికి సమర్పించడం సంప్రదాయబద్ధంగా వస్తుందన్నారు. 

భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయడం తో పాటు, వివిధ స్వచ్చంద సంస్థలు సైతం భక్తుల సేవలో పాల్గొంటున్నాయన్నారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam