DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తెలుగు జాతి పూర్వ వైభవానికి కృషి చేస్తా: చంద్రబాబు

*(DNS Report : P Raja, Bureau Chief, Amaravati)*

*అమరావతి, ఏప్రిల్ 20, 2022 (డిఎన్ఎస్):* ప్రాభవం కోల్పోతున్న తెలుగు జాతి వైభవం తిరిగి తెచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలుగుదేశం అధ్యక్షులు  చంద్రబాబు తెలిపారు. బుధవారం తన జన్మదినం సందర్భంగా అయన విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం

అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల పక్షాన పోరాడేందుకు శక్తిసామర్థ్యాలు ఇవ్వాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారి అభివృద్ధి కోసం తెదేపా ఎప్పుడూ పాటుపడుతుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు తనను ఆశీర్వదిస్తున్నారని,శుభాకాంక్షలు చెబుతున్నారన్నారు.

వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. అందరి అంచనాలకు తగ్గట్లు పని చేస్తూ తెదేపాను నడిపిస్తానని చంద్రబాబు వివరించారు.

చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరిగాయి. 

తిరుమల అఖిలాండం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. 720 కొబ్బరికాయలు కొట్టి, 720 గ్రాముల కర్పూరం

వెలిగించారు. అలిపిరి శ్రీవారి పాదాల చెంత తెదేపా కార్యకర్తలు 1,116 కొబ్బరికాయలు కొట్టి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam