DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బిక్కవోలులో రూ. 2470 కోట్ల బిర్లా పరిశ్రమకు సీఎం ప్రారంభం 

*(DNS Report : P Raja, Bureau Chief, Amaravati)*

*అమరావతి, ఏప్రిల్ 21, 2022 (డిఎన్ఎస్):* తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో బిర్లా గ్రూప్‌ గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ - క్లోర్ ఆల్కలీ మ్యానుఫ్యాక్చరింగ్‌ సైట్‌ ( కాస్టిక్‌ సోడా యూనిట్‌)ను ముఖ్యమంత్రి వైయస్‌. జగన్‌ మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ

కార్యక్రమంలో ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా కూడా పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ ప్రతినిధులకు, ప్రజా ప్రతినిధులకు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అభినందనలు తెలిపారు.
 
ఈ రోజు ఒక మంచి రోజు అని, అనపర్తిలో

దాదాపుగా రూ.1000 కోట్ల ఖర్చుతో పరిశ్రమ పెట్టారు. మూడు దశలలో కలిపి దాదాపుగా రూ.2470 కోట్ల పెట్టుబడి పెట్టడంతో పాటు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ 2450 మందికి ఉద్యోగాల కల్పించే గొప్ప కార్యక్రమం అన్నారు. 

వేదికపై ఉన్న కుమార మంగళం బిర్లా గురించి, ఆదిత్య బిర్లా గ్రూప్‌ గురించి నాలుగు మాటలు చెప్పాలంటే... దేశవ్యాప్తంగా

రూ.6 లక్షల కోట్ల మార్కెట్‌ విలువ, దాదాపుగా 1 లక్షా 40 వేల మందికి ఉద్యోగాలు కల్పించిన మంచి వ్యక్తి, మంచి పారిశ్రామికవేత్త. 
ఇలాంటి వాళ్లు ఇక్కడికి రావడం, మన ప్రభుత్వం మీద మరింత నమ్మకం చూపిస్తూ అడుగులు ముందుకు వేయడం రాష్ట్రానికి మంచి పరిణామాల కింద తోడవుతాయి. 
ఈ రాష్ట్రంలో 75 శాతం ఉద్యోగాలన్నీ కూడా కచ్చితంగా

స్ధానికులకే ఇవ్వాలని ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. ఇలాంటి చట్టం తీసుకొచ్చిన నేపధ్యంలో ఉద్యోగాలు రావాలంటే ఇలాంటి పెద్దవాళ్లు అడుగులు ముందుకువేయాలి. వీళ్లు(ఆదిత్య బిర్లా గ్రూప్‌) చూపిస్తున్న ఈ చొరవ దేశంలో మిగిలిన వారికందరికీ గొప్ప ముందడుగు అవుతుంది. ఇవాళ మంచి కార్యక్రమానికి  శ్రీకారం

చుడుతున్నాం. 

అలాంటి సందర్భంలో ఈ ప్రాజెక్టు నేపధ్యం గురించి కూడా చూస్తే... మనకన్నా చాలా సంవత్సరాల ముందు 2010–12 మద్య ప్రాంతంలో రక,రకాల ఇబ్బందులు పడుతూ వచ్చింది. చివరికి ఈ ప్రాజెక్టు గ్రాసిమ్‌ సంస్ధ చేపట్టి అడుగులు ముందుకు వేయించింది. 

ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు మాత్రమే అప్పటి ప్రభుత్వం ఈ

ప్రాజెక్టును గ్రాసిమ్‌ సంస్ధకు అప్పగిస్తూ సంతకాలు చేసింది. ఆ తర్వాత ప్రాజెక్టుకు ఇంతకు ముందున్న సమస్యలు అలాగే కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వ పెద్దలు సంతకాలు చేసారు కానీ సమస్యలు పరిష్కారం చేయలేదు. సమస్యలు పరిష్కారం కాకుండా సంతకాలు చేస్తే పరిశ్రమ రాదు అన్న కనీస ఆలోచన కూడా లేకుండా అడుగులు ముందుకు వేశారు. ఆ తర్వాత

మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగానే ఇక్కడ సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరిస్తూ... ఒక మార్గం చూపించి ఈ పరిశ్రమ ఇక్కడ పెట్టించగలిగితే వేల కోట్ల రూపాయులు పెట్టుబడులు రావడమే కాకుండా.. దాదాపుగా 2500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న మంచి ఆలోచనతో ఆ సమస్యలన్నీ అధిగమించేందుకు పరిష్కారం

చూపుతూ అడుగులు వేశాం. 

ఈ పరిశ్రమ వస్తే గ్రామం కాలుష్యమవుతుందన్న భయాల నేపధ్యంలో... కేప్టివ్‌ థర్మల్‌ ప్లాంట్‌ వినియోగంలోకి వస్తే దానివల్ల ఈ భయాలు ఇంకా ఎక్కువవుతాయని అనుకున్న పరిస్థితుల్లో కేప్టివ్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ పెట్టకూడదని ఆదిత్యా బిర్లా గ్రూప్‌ యాజమాన్యాన్ని కూడా ఒప్పించాం

అన్నారు.  

అది కాకుండా పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలన్నీ వదిలేస్తే.. నీరు కలుషితమయ్యే విషయంలో కూడా స్ధానికులకు రకరకాల ఆందోళనలు, భయాలు ఉన్న  వాతావరణం గతంలో చూశాం. దానిని కూడా అధిగమించేందుకు టెక్నాలజీలో కూడా ఏకంగా మార్పులు చేశాం. 
గతంలో ఇదే ప్లాంట్లులో ఉన్న టెక్నాలజీ మెర్క్యురీ మెంబ్రేన్‌ ద్వారా

ఉత్పత్తి అయ్యే పాత పరిస్థితిని మార్పు చేసి ఎలక్ట్రాలసిస్‌లో కూడా మెరుగైన విధానాన్ని క్రోడీకరించి కాలుష్యానికి ఏమాత్రం అవకాశమివ్వని విధంగా అడుగులు ముందుకు వేశాం.  

జీరో లిక్విడ్‌ వేస్ట్‌ అనే విధానాన్ని తీసుకుని... లిక్విడ్‌ వేస్ట్‌ డిశ్చార్జ్‌ అనేది ఎక్కడా ఉండకూడదని, ఆ విషయాన్ని కూడా చెప్పి

యజమాన్యాన్ని ఒప్పించాం. 
ఇవన్నీ రకరకాల పద్ధతిలో ఇన్‌కార్పొరేట్‌  చేసి,  భయాలకు తావిచ్చే పరిస్థితి ఈప్రాజెక్టులో లేకుండా చేసిన పిమ్మట... 75 శాతం ఉద్యోగాలన్నీ స్ధానికులకే రావాలని మనం చేసిన చట్టాన్ని కూడా వివరించాం. చట్టంలో ఉన్న సారాంశం ప్రకారం 75 శాతం ఉద్యోగాలు స్ధానికులకే ఇచ్చేటట్టు ఒప్పించాం. కాబట్టి ఈ

ప్రాజెక్టు వల్ల మంచి జరుగుతుంది. 
ఈ ప్రాజెక్టు వల్ల వచ్చే సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ కూడా చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడుతుందన్న ఆలోచనతో అడుగులు వేశాం.

దేశంలోనే కాస్టిక్‌ సోడా ఉత్పత్తిలో ఏకైక అతిపెద్ద యూనిట్‌ ఇది. ఆసియాలో అత్యాధునికమైన ప్లాంట్‌ ఇది. రాష్ట్రానికి గర్వకారణమైన విషయమిది.

భవిష్యత్తులో అనుబంధరంగ పరిశ్రమల ఏర్పాటుకు కూడా ఇది దోహదపడుతుంది. 

గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్, కుమార మంగళం అపార అనుభవం, పరిచయాలు ఆంధ్రప్రదేశ్‌ ఎదుగుదలకు కచ్చితంగా తోడ్పడతాయని, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్దిలో భాగస్వామి కావాలని, రాష్ట్రానికి రాయబారిగా, గర్వకారణంగా నిలబడాలని ఆశిస్తున్నాను. ఇది దేశం నలుమూలల

నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడానికి ఉపయోపడుతుందని  భావిస్తున్నాను.  ఈ సందర్భంగా కుమార మంగళం బిర్లాకు, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌కు నా శుభాకాంక్షలు. మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏ సహకారం అవసరమైన అందించడానికి మేం సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుతున్నానన్నారు . 



కార్యక్రమం లో బిర్లా ప్రతినిధులతో పాటు,  మంత్రులు గుడివాడ అమర్ నాధ్, తానేటి వనిత, చెన్నుబోయిన గోపాలకృష్ణ, రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరత్, అనపర్తి ఎమ్మెల్యే డా. నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ డా. మాధవీలత, తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam