DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అల్లూరి కోసం జులై 4 న ప్రధాని మోడీ భీమవరం రాక 

"అల్లూరి కి భారత ప్రభుత్వం అత్యున్నత గౌరవం"

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, ఏప్రిల్ 21 , 2022 (డిఎన్ఎస్):* ఈ ఏడాది జులై 4, న భీమవరంలో జరుగనున్న అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి సంబరాలను ప్రారంభించేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ఏడాది పాటూ జరిగే ఈ వేడుకలను

అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ది క్షత్రియ సేవా సమితి (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్) ప్రతినిధులు చేసిన ప్రయత్నానికి మంచి ఫలితం లభించింది.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విశేష సహకారంతో ఫలించిన భారత ప్రభుత్వం 75 సం. ల స్వాతంత్ర్యం సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న "ఆజాదీ కా అమృత్

మహోత్సవ్" కార్యక్రమం ద్వారా "అన్ సంగ్ హీరోస్ " ని గుర్తించి గౌరవిస్తున్న విషయం తెలిసిందే. 
ఇన్నాళ్లకు అల్లూరి సీతారామరాజు సేవలను భారత ప్రభుత్వం గుర్తించి గౌరవించడం ద్వారా సుమారు 100 సంవత్సరాల తెలుగు ప్రజల ఆకాంక్షను గౌరవించడమే. ఇది తెలుగు ప్రజల విజయం ... దేశ భక్తునికి ఘన నివాళి అందించినట్టు

అయింది.

కేంద్ర సాంస్కృతిక మంత్రి కిషన్ రెడ్డి గారి విశిష్ట కృషి మరియు ప్రత్యేక శ్రద్ధ వలన తెలుగు రాష్ట్రల సాంస్కృతిక మంత్రిత్వ శాఖల సౌజన్యం తో అల్లూరి 125వ జయంతి ని తెలుగు రాష్ట్రాల్లో మొదలు పెట్టి తరువాత దేశ వ్యాప్తంగా నిర్వహించాలని ప్రణాళిక రూపొందించడం జరిగిందని క్షత్రియ సేవా సమితి ( తెలంగాణ &

ఆంధ్రప్రదేశ్) అధ్యక్షులు పేరిచెర్ల నాగరాజు, ప్రధాన కార్యదర్శి నడింపల్లి నాని రాజు లు తెలియచేస్తున్నారు. 

ఏడాది కార్యాచరణ: - 

జులై 4, 2022 నుండి జులై 4, 2023 ... ఒక సంవత్సరం పాటూ వివిధ సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు ...

1. మే 7 వ తేదీ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తన ట్విట్టర్లో శ్రీ అల్లూరి

సీతారామరాజు  98 వ  వర్ధంతి కి నివాళులు అర్పించడం. అంతేకాకుండా, పీఎంఓ కార్యాలయం ద్వారా మరియు ప్రముఖుల ద్వారా శ్రద్దాంజలి ఘటించడం.

2. "మన్ కీ బాత్" కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అల్లూరి సీతారామరాజు గురించి ప్రస్తావించడం.

3. మే 7, 2022 న   రాష్ట్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ & క్షత్రియ సేవా

సమితి (TS&AP) చే రవీంద్రభారతిలో ఉదయం 11.00 గం. లకు తెలంగాణా ప్రభుత్వ ఘన నివాళి. దీనిలో  తెలంగాణ మంత్రులు  కె టి రామారావు, శ్రీనివాస్ గౌడ్ మరియు ఇతర ప్రముఖులు పాల్గొంటారు.

మే 7 సాయంత్రం 5 గం.లకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు ఆర్ కె రోజా ల చే వైజాగ్ లో ఘన నివాళి. 
పాండ్రంగి నుండి వైజాగ్

వరకు యువకుల బైక్ రాలీ. 
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఇతర మంత్రులు కూడా పాల్గొంటారు. క్షత్రియ సేవా సమితి వైజాగ్ & క్షత్రియ సేవా సమితి TS&AP కలసి ఇతర క్షత్రియ సేవా సమితుల, క్షత్రియ యువజన సంఘాలు మరియు స్వచ్చంద సంస్థల సహకారంతో చేస్తున్న కార్యక్రమం.

జులై 4, 2022 to జులై 4, 2023 ( 125 వ జయంతి జాతీయ సంబరాలు)

1. జులై 4, 2022

: 125వ జయంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు కి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గారిచే ఘన నివాళి. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ భీమవరం పట్టణంలో భారీ బహిరంగ సభా ముఖంగా అల్లూరి కి ఘన నివాళి. 

అల్లూరి సీతారామరాజు గారి స్వగ్రామం మోగల్లు గ్రామంలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం సహాయంతో... ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ

గారి చేతుల మీదుగా చారిత్రాత్మక మైన నిర్మాణం (Land mark Monument) జాతికి అంకితం.  (Virtual Launch from Bhimavaram meeting)

మోగల్లు గ్రామంలో అల్లూరి సీతారామరాజు బాల్యంలో గడిపిన ఇంటిని రీ మోడల్ చేసి, అల్లూరి సీతారామరాజు ధ్యాన మందిరం గా జాతికి అంకితం. అల్లూరి జీవిత చరిత్ర మరియు విశేషాల నిక్షిప్తీత.

తద్వారా అల్లూరి స్వగ్రామం మోగల్లు

ఒక  ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా మారే అవకాశం.

2. అల్లూరి సీతారామరాజు తల్లి స్వగ్రామం, ఆయన పుట్టిన పాండ్రంగి గ్రామంలో ఆయన ఆనవాళ్లను పునరుద్ధరించి కాపాడుకోవడం.

3. రాష్ట్ర, కేంద్ర సాంస్కృతిక శాఖ సహకారంతో, కృష్ణదేవి పేట లో ఉన్న అల్లూరి సీతారామరాజు ఉద్యానవనం సుందరీకరణ పనులు. 

4. అల్లూరి

సీతారామరాజు తనకు తానుగా బ్రిటీష్ ప్రభుత్వానికి లొంగిపోయిన మంప గ్రామం కు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేయడం. ఏ చెరువు ఒడ్డున అయితే లొంగిపోయారో, ఆ చెరువు సుందరీకరణ మరియు చెరువు మధ్యలో అల్లూరి విగ్రహ ప్రతిష్ఠ.

5. ఆగస్ట్ 22, 2022- రంప తిరుగుబాటుకు 100 సంవత్సరాలు. ఆగస్ట్ 22, 1922 న చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద దాడి తో మన్యం

తిరుగుబాటుకు శ్రీకారం చుట్టారు. ఆగస్ట్ 22, 2022 న చింతపల్లి నుండి ర్యాలీ. చింతపల్లి పోలీస్ స్టేషన్ ఆనవాళ్లను పునరుద్ధరించడం

6. మన్యం లో అల్లూరి సీతారామరాజు గారి విప్లవ ఆనవాళ్లను పునరుద్ధరించడం. రాజవొమ్మంగి, అడ్డతీగల, నరసీపట్నం ... ఇలా అల్లూరి చరిత్ర తో ముడిపడిన వివిధ ఆనవాళ్లను కాపాడుకోవడం.

7. అల్లూరి

సీతారామరాజు జీవిత చరిత్రను 15 ని.లు నిడివి గల 3D అనిమేషన్ చిత్రం నిర్మాణం మరియు అల్లూరి విశిష్టతను తెలిచేస్తూ రాంభట్ల నృసింహా రచనలో మాధవపెద్ది సురేష్ సంగీత సారధ్యంలో ఒక అద్భుతమైన పాట జాతికి అంకితం.

8. ముఖ్యంగా... అల్లూరి సీతారామరాజు తో కలసి పనిచేసిన పలు వీరుల (గంటం దొర, మల్లు దొర, గోకిరి ఎర్రేసు, అగ్గిరాజు....)

కుటుంబాలను గుర్తించి, వారి ఆర్ధిక స్థితి గతులు తెలుసుకుని... వారి కుటుంబాలను ఆర్ధికంగా...సామాజికంగా ఆదుకుని శాశ్వత పరిష్కారం అందించడం. మన కోసం, మన మనుగడ కోసం ప్రాణత్యాగం చేసిన ఆ మహనీయుల కుటుంబాలను ఆదుకోవడం మనందరి బాధ్యత అని మా భావన.

9. మే7, 2023 - దేశ వ్యాప్తంగా ఇటు కేంద్ర మరియు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలచే అధికారిక

శ్రద్ధాంజలి.

10. జులై 4, 2023 - లంబసింగి ప్రాంతంలో 35 కోట్ల తో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న స్వాతంత్య్ర  సమరయోధుల మ్యూజియం జాతికి అంకితం ద్వారా సంవత్సరం పాటూ నిర్వహించ తలపెట్టిన అల్లూరి సీతారామరాజు125 వ జయంతి జాతీయ సంబరాలు ముగుస్తాయి.
- -
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ద్వారా తెలుగు ప్రజల ఆకాంక్షను క్షత్రియ

సేవా సమితి (TS&AP) ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కి విన్నవించడం జరిగింది:

1. అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం పార్లిమెంట్ లో ప్రతిష్టించడం
2. విశాఖపట్నం లో రానున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి శ్రీ అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం
3. భావి తరాలకు స్ఫూర్తిదాయకమైన మన్యం తిరుగుబాటు ను దేశ వ్యాప్తంగా అన్ని

సిలబస్ లో పాఠ్యంశం గా చేయాలని కోరడం జరిగింది.

రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం పై గిరిజన హక్కులకోసం, దేశ స్వేచ్చ కోసం పూరించిన సమర శంఖారావం, విప్లవ సాయుధ పోరాటం "మన్యం తిరుగుబాటు" మూడు వందల సామ్.ల భారత స్వాతంత్ర్య చరిత్ర లో స్వర్ణలిఖితం. ఛత్రపతి శివాజీ తరువాత జరిగిన ఏకైక గెరిల్లా యుద్ధం. 100 సం. ల క్రితం

బ్రిటీష్ ప్రభుత్వం ఆరోజుల్లోనే 40 లక్షలు ఖర్చుపెట్టడం, సుమారు 2300 సాయుధ బ్రిటీష్ దళాల ను మన్యంలో మోహరించడం మన్యం తిరుగుబాటు యొక్క ప్రత్యేకతను, ప్రాముఖ్యతను తెలియచేస్తుంది. ఇటువంటి చారిత్రాత్మక పోరాటాన్ని జరిపిన తెలుగు పౌరషాన్ని ప్రతి ఒక్కరికీ తెలియచేయడo తెలుగు వాడిగా...ఒక భారతీయుడిగా మనకి గౌరవం...గర్వకారణం.

/>  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam