DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూ ర్యాలీలు భారత్ లో కాకుంటే పాక్ లో చేస్తారా?

*ముస్లింలకు 1947 లోనే ప్రత్యేక దేశం ఇచ్చేశాం, కేంద్రమంత్రి*  

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, ఏప్రిల్ 21 , 2022 (డిఎన్ఎస్):* హిందూ పండగల ర్యాలీలు హిందూ సంప్రదాయవాదులు 80 % ఉన్న భారత్ దేశంలో కాకుండా పాకిస్తాన్, బాంగ్లాదేశ్,   ఆఫ్గనిస్తాన్ ల్లో చేస్తారా అని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ఆగ్రహం

వ్యక్తం చేసారు.   

బీహార్ లోని కటిహార్‌ లో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇటీవల శ్రీరామనవమి ఊరేగింపులపై జరిగిన దాడుల నేపథ్యంలో ఆయన కుహనా, కుతంత్రవాదులపై మండిపడ్డారు. భారత్ లో ఉన్న దేశ ద్రోహులు హిందువులు తమ పండుగలు జరుపుకోడాన్ని సహించలేకపోతున్నారన్నారు. 

అసహనవాదులు చేస్తున్న ఈ

దాడులు భారతదేశం భిన్న సంస్కృతుల సంగమమనే వాదంలోని డొల్లతనాన్ని బయటపెట్టాయని సింగ్‌ పేర్కొన్నారు.

హిందూ ప్రదర్శనలు కాకుండా మరే ఇతర మత ప్రదర్శనలపైనైనా దాడులు జరిగి ఉంటే రాహుల్‌ గాంధీ, లాలూప్రసాద్‌ యాదవ్‌ వంటివారు రాజకీయంగా నానా యాగీ చేసి ఉండేవారు. రాజకీయ పర్యటనలు చేపట్టి దేశమంతా హడావిడి

చేసేవారు’’ అని గిరిరాజ్‌ విమర్శించారు.

హిందువులు మతపరమైన ప్రదర్శనలతో ముస్లిం ప్రాంతాలకు వెళ్లకూడదని మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, ‘జిన్నా డీఎన్‌ఏ కలిగిన లౌకికవాదులు’ సలహాలు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. 1947లోనే దేశ విభజన పూర్తయింది..  అయినా హిందూ-ముస్లిం ప్రాంతాలంటూ ఇప్పటికీ విభజన

మనస్తత్వాన్ని ప్రదర్శించడం సరికాదు అని హెచ్చరించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam