DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తప్పు జరుగకుంటే సిబ్బందిపై వేటు ఎందుకు పడింది?

*డీటీసీ వివరణ తో సమన్వయ లోపం బయట పడిందా?*

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, ఏప్రిల్ 22 , 2022 (డిఎన్ఎస్):* ఒంగోలు నడిరోడ్డుపై ఆగిన ఓ ప్రయివేట్ ఇన్నోవా కారు ను ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం బలవంతంగా  లాక్కున్న ఘటనపై ప్రభుత్వ అధికారుల సమన్వయ లోపం కొట్టవచ్చినట్టు బయట పడింది. వినుకొండ నుంచి తిరుమల

వెళ్తున్న ఓ కుటుంబం ఒంగోలు బుధవారం రాత్రి ఒంగోలు లో ఆగిన సమయంలో ఓ హోమ్ గార్డ్ వీళ్ళ నుంచి వాహనాన్ని బలవంతంగా లాక్కుని, వీళ్ళని రోడ్డు మీద  నిలబెట్టడం తో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో విషయం ముఖ్యమంత్రి వరకూ వెళ్లడంతో, ఓ రవాణా శాఖా అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ అధికారి సంధ్య ను, హోమ్ గార్డ్ తిరుమల

ని సస్పెండ్ చేస్తు ఆదేశాలు విడుదల చేశారు.  

ఈ ఘటన పోరపాటు న జరిగింది అనుకున్నారు. అయితే ఈ ఘటనపై ఒంగోలు ఉప రవాణా శాఖా కమిషనర్ కృష్ణవేణి ఈ వాహనానికి ఫిట్నెస్ సరిగ్గా లేకపోవడంతో సీజ్ చేసాం అంటూ ఇచ్చిన వివరణతో మరింత ఇబ్బందికర ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 

ఒక ఫిట్నెస్ లేని వాహనాన్ని అధికారులు

సీజ్ చేస్తే  పనిషమెంట్ వాహనం యజమానికి విధించాలి గానీ ఏకంగా ఆర్టిఏ అధికారుల పై సస్పెన్షన్ వేటు వెయ్యడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ప్రతిరోజు చాల వాహనాలకు ఫిట్నెస్ గానీ, ఇతర వాహనాలకు ఎన్నో లోపాలు ఉంటాయి. వాటికి బాధ్యుల్ని చేస్తూ రవాణా శాఖా అధికారుల కు శిక్ష విధిస్తారా ఏంటి?

డీటీసీ ఇచ్చిన వివరణే

వాస్తవమైతే. .వాహనం, సీజ్ చేసిన ఇదే విషయాన్నీ కారు  లాక్కున్న  స్వాధీనం చేసుకున్న కానిస్టేబుల్ లేదా హోమ్ గార్డ్ కారు ప్రయాణికులకు చెప్పి ఉండాలి కదా.

ఏది ఏమైనా ఈ ఘటన తో ప్రభుత్వ అధికారుల మధ్య ఉన్న సమన్వయ లోపం పూర్తిగా కొట్టవచ్చినట్టు బయటపడింది. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam