DNS Media | Latest News, Breaking News And Update In Telugu

24 న జొన్నవిత్తుల ఉత్తరాంధ్ర శతకం విశాఖలో ఆవిష్కరణ 

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, ఏప్రిల్ 22 , 2022 (డిఎన్ఎస్):* ఈ నెల 24 న తెలుగు వేదకవి గా ప్రసిద్ధికెక్కిన  జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచించిన పది శతకాలలో ప్రధానమైన ఉత్తరాంధ్ర శతకం ఆవిష్కరణ విశాఖలో జరుపుతున్నట్టు నిర్వాహక సంచాలకులు విజయ్ నిర్మాణ్ కంపెనీ అధినేత డా.  సూరపనేని విజయకుమార్

తెలియజేశారు. శుక్రవారం విశాఖ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఆవిష్కరణ సభ ఆదివారం సాయంత్రం గం. 06:30 లకు కళాభారతిలో నిర్వహిస్తున్నామన్నారు. 

ఈ అంకితమిచ్చే కార్యక్రమం ఈ నెల 24 న ఉదయం 9 గంటలకు విశాఖపట్నం బీచ్లో జరుగుతుంది. కవి స్వదస్తూరితో వ్రాసిన 108 పద్యాల ప్రతిని పూలతో అలంకరించి,

సముద్రునికి, ఉత్తరాంధ్రకి, తెలుగుతల్లికి జేజేలు పలుకుతూ తెలుగు భాషాభిమానులు విద్యార్థుల సమక్షంలో సముద్రునికి సమర్పిస్తారు. ఆ తరువాత సాగరతీరంలో చిన్నారులు అక్షరమాల వ్రాసి, పుష్పాలతో పూజించి తెలుగు పద్యాలు, పాటలు పాడతారన్నారు. 

జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచించిన పది శతకాలు ప్రచురణ చేసి రెండు

తెలుగు రాష్ట్రాల్లో సభలు చేయాలని అమెరికాలోని తెలుగు భాషాభిమానులు పూనుకున్నారు. ఈ శతక జైత్రయాత్ర కార్యక్రమానికి... అమెరికా తెలుగు దిగ్గజం, తానా పూర్వ అధ్యక్షులు తోటకూర ప్రసాద్ సారథ్యం వహిస్తున్నారు. ఈ శతక సభలలో మొదటి సభ విశాఖలో జరుగుతోందన్నారు . 

సాయంత్రం ఉత్తరాంధ్ర శతకం ఆవిష్కరణ సభలో కవి జొన్నవిత్తుల

రామలింగేశ్వరరావు తను రచించిన మరి కొన్ని శతక పద్యాలు కూడా గానం చేస్తారు అని సమావేశంలో పాల్గొన్న యోగాచార్య ఘట్టి వేదభాస్కరం, పరవస్తు ఫణిశయన సూరి తెలియజేశారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam