DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కౌలు రైతు కుటుంబానికి జనసేనాని రూ. లక్ష సాయం  

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, ఏప్రిల్ 23 , 2022 (డిఎన్ఎస్):* సాగు నష్టాలు, ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ఇటీవల బలవన్మరణానికి పాల్పడిన కౌలు రైతు యర్రా రాంబాబు కుటుంబాన్ని జనసేన  పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శనివారం పరామర్శించారు. చింతలపూడి నియోజకవర్గం సుందరరావు పేట గ్రామానికి వెళ్లి రాంబాబు తల్లి

సుబ్బమ్మ, కుమారుడు రమేష్ లను ఓదార్చారు. పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందించారు. ఈ సందర్భంగా రాంబాబు తల్లి సుబ్బమ్మ మాట్లాడుతూ... మా అబ్బాయి చనిపోయి రెండేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఒక్క అధికారి కూడా మా

ఇంటి గడప తొక్కలేదని వాపోయారు. మీరు మాత్రమే మా కష్టాలు తెలుసుకొని మా ఇంటికి వచ్చి ఆదుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్తో పాటు పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam