DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోహత్య ఆపాల్సిందే, గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి

*గో రక్షణకె మా జీవితం అంకితం: యుగ తులసి శివకుమార్*   

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, ఏప్రిల్ 24 , 2022 (డిఎన్ఎస్):* గో హింస ఆగాలని, గో హత్యలు ఆపాలని, కబేళాలు మూసివేయాలని, గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని యుగ తులసి ఫౌండేషన్   చైర్మన్, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు కె. శివ కుమార్ డిమాండ్ చేశారు.

ఆదివారం విశాఖ లోని ద్వారకానగర్ లోని ఓ పాఠశాల లో నిర్వహించిన గో రక్షణ పై అవగాహనా శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ గో రక్షణకె మా జీవితం అంకితం అన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి పాదాల సాక్షిగా లక్ష గోవులను సంరక్షిస్తానని ప్రమాణం చేసానని, తన జీవితాన్ని గోమాతకే

అంకితం చేసానని తెలిపారు.  ఈ ఆత్మీయ సమావేశానికి విశాఖపట్నం, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలకు చెందిన గో బంధువులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

దేశం మెత్తం మీద తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా గో హత్యలు జరుగుతున్నాయని, దురదృష్టవశాత్తూ ఎక్కువ సంఖ్యలో గోవులు ఆంధ్రప్రదేశ్ నుంచి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచే

వస్తున్నాయని, ఈ దారుణాన్ని ఆపాలన్నారు.

రైతు దేశానికి వెన్నెముక అయితే గోవు రైతుకే వెన్నెముక అని గోవుని అమ్ముకోవడం కాకుండా రైతులు గోవుని నమ్ముకోవాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రలో గో రక్షణ ఉద్యమానికి యుగ తులసి సన్నద్ధం అవుతుందని, గో బంధువులు, మరియు ప్రజల సహకారంతో ప్రతి గోవుని రక్షిస్తామని

ప్రకటించారు. 

ఈ సందర్భంగా తాము గో రక్షణ సేవలో భాగంగా చేపట్టిన కొన్ని ప్రధాన అంశాలను వివరించారు. వాటిల్లో . . . 

1.)  గో రక్షణ కోసం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త త్రిదండి చిన్న జీయర్ స్వామి వారిచే శ్రీకారం చుట్టామన్నారు. 

2.) గడప గడపకూ గో జండా,  2021 ఏప్రిల్ 1 న గో

రక్షణకై తెలంగాణలోని భాగ్యనగరం లో ఎన్టీఆర్  స్టేడియంలో గో మహాగర్జన కు అత్యంత భారీ స్పందన లభించిందన్నారు. దీని లో  చిన్న జీయర్ స్వామి ప్రత్యక్షంగా పాల్గొని స్ఫూర్తి కల్గించారన్నారు.   

3.) ఫిబ్రవరి 26 న భాగ్యనగరం లోని ఇందిరా పార్క్ వద్ద గో రక్షా ధర్నా, 

4.) 2021 అక్టోబర్ 30, 31 లో రెండు రోజుల పాటు

తిరుపతి మహతి ఆడిటోరియం లో గో మహా సమ్మేళనం , 

5.) 2021 అక్టోబర్  6 న  మహిళా గో పాదయాత్ర, గో సహాయ నిరాకరణ, గో నిరసన దీక్ష,  గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి అనే సంకల్పంతో 

6.) 2021 ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 1 వరకూ భాగ్యనగరం నుంచి తిరుమల కు మహా పాదయాత్ర చేయడం జరిగిందన్నారు.  

అంతకు ముందు మిజోరాం

గవర్నర్ డా. కె హరిబాబు ను కలిసి, గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించేందుకు సహకరించవలసినదిగా కోరారు. 

ఈ సమావేశంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన గో బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam