DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సమస్యల అవగాహనా తదుపరే రాజకీయ ప్రస్థానం : సీబీఐ మాజీ జేడీ వివిఎల్

సమస్యల అవగాహనా తదుపరే రాజకీయ ప్రస్థానం : వివిఎల్ 

విశాఖపట్నం, ఆగస్టు 9 , 2018 (DNS Online ): రాష్ట్రం లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి అవగాహనా ఏర్పడిన తర్వాతే

రాజకీయరంగ ప్రవేశం ఉంటుందని, విశ్రాంత ఐపీఎస్ అధికారి వివి లక్ష్మీనారాయణ ప్రకటించారు. గురువారం నగరానికి వచ్చిన అయన DNS కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో తన

ఆలోచనలను వెల్లడించారు. స్వఛ్చంద పదవి విరమణ తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటిస్తూ ఆయా గ్రామాల్లో ప్రజలతో మమేకమై రాత్రిళ్ళు సైతం అక్కడే

విశ్రమిస్తూ క్షేత్ర స్థాయి నుంచి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. సమస్యలకు తాత్కాలిక పరిష్కారం సరైన విధానం కాదని, దాన్ని సమ్మూలంగా

పరిష్కరించాలన్నారు. ప్రధానంగా రైతాంగంతో కలిసి పని చేస్తున్న సమయాల్లో ఎన్నో విషయాలు వారి నుంచి నేర్చుకుంటున్నట్టు వివరించారు. ఇప్పడి వరకూ తొమ్మిది

జిల్లాల్లో పర్యటించానని, నేడు విశాఖపట్నం జిల్లాకు వఛ్చినట్టు తెలిపారు. ఇదే సందర్బంగా గురువారం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం కావడం తో విశాఖ జిల్లా పాడేరు

ప్రాంతానికి చేరుకొని రెండు మూడు రోజులు ఆయా పరిసర ప్రాంతాల్లో సంచరించనున్నట్టు తెలిపారు. ప్రధానంగా ఒక గ్రామాన్ని తానూ దత్తత తీసుకున్నానని , నెలకోసారి ఆ

గ్రామం చేరుకొని అక్కడే బస చేసి, అక్కడ జరుగుతున్నా అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నట్టు వివరించారు. ప్రధానంగా విద్య, వైద్యం, ఉపాధి, పారిశుధ్యం

తదితర అంశాలపై దృష్టి సారించినట్టు తెలిపారు. గ్రామ స్థాయి లో సమస్యలు తెలుసుకుని, వాటి పై పూర్తి అవగాహనా ఏర్పడిన తరవాతే రాజకీయ ప్రస్తానం మొదలవుతుందని, ఈ సమస్యల

పరిష్కారానికి రాజకీయ à°°à°‚à°— ప్రవేశం అవసరమా లేదా అనే దాని పై కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కూడా ఉన్నాయన్నారు.   

 

#dns  #dnsnews   #dns news  #dnslive  #dns live  #dnsmedia #dns media  #visakhapatnam  #vizag  #cbi jd  #lakshminarayana   #political  #ips lakshminarayana 

#vvl ips 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam