DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రామతీర్ధం విగ్రహ ప్రతిష్ట, సీఎం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం 

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, ఏప్రిల్ 25 , 2022 (డిఎన్ఎస్):*  ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయనగరం జిల్లా లోని రామతీర్థం లో కొండపై శ్రీ సీతారాముల విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం లో ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్

మజ్జి శ్రీనివాసరావు, దేవాదాయ శాఖ కమిషనర్ డా.ఎం.హరిజవహర్ లాల్, జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి, శాసన సభ్యులు బడుకొండ అప్పల నాయుడు, బొత్స అప్పల నరసయ్య, ఎమ్మెల్సీలు రఘు రాజు, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. 
గత ఏడాది డిసెంబర్ లో ఆలయ పునర్నిర్మాణం పనులు ప్రారంభించి కేవలం నాలుగు నెలల కాలంలో పూర్తి చేశామని

కొట్టు సత్యనారాయణ తెలిపారు. మూడు కోట్లతో రికార్డు సమయంలో ఆలయ నిర్మాణం పూర్తి చేసి విగ్రహ ప్రతిష్ట చేయడం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి వున్న చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. 

రామతీర్థం లో జరిగే శ్రీరామ నవమి ఉత్సవాలను రాష్ట్ర పండుగ గా గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి బొత్స

సత్యనారాయణ తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam