DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మంత్రుల దృష్టిలో మహా విశాఖ తీర్థయాత్రా క్షేత్రమేనా?  

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, ఏప్రిల్ 25 , 2022 (డిఎన్ఎస్):* రాష్ట్ర ముఖ్యమంత్రి విశాఖ మహా నగరాన్ని రాష్ట్ర రాజధానిగా మారుద్దాం అని నిరంతరం శ్రమిస్తుంటే. . .అందుకు భిన్నంగా రాష్ట్ర మంత్రులు ఈ నగరాన్ని ఒక తీర్థ యాత్రా క్షేత్రంగానే భావిస్తుండడం గమనార్హం. ఇటీవల రెండవ విడతలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం

చేసిన మంత్రుల్లో చాలామంది విశాఖనగరానికి వచ్చేది కేవలం తీర్థయాత్ర కోసమే అన్నట్టుగా కనపడుతోంది. విజయవాడ నుంచి విశాఖ కు విమానం లో వచ్చి విశాఖ విమానాశ్రయం నుంచి నేరుగా నగర శివారు లోని చినముషిడివాడలో గల శారదా పీఠానికి వెళ్తున్నారు. అక్కడ పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వాముల దర్శనం చేసుకుంటున్నారు. ఒక

అరగంట సంభాషిస్తున్నారు. తదుపరి సింహాచల క్షేత్రానికి వెళ్లి శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామిని దర్శించుకుని తిరిగి విమానాశ్రయానికి వెళ్లిపోతున్నారు. వెళ్లే ముందు అందరూ చెప్పే మాట ఒక్కటే ఈ సారి గురువుల దర్శనం, రెండో దర్శనం లో శాఖా అధికారులతో సమీక్ష.. . .
ఇప్పడికే విశాఖ శ్రీ శారదా పీఠాన్ని దర్శించిన వారిలో  రోజా,

కొట్టు సత్యనారాయణ, చెన్నుబోయిన, సీదిరి అప్పలరాజు, బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్ నాధ్, తదితర మంత్రులు ఉండగా నేడు జిల్లా ఇంచార్జి మంత్రి విడదల రజని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామిని దర్శించుకున్నారు. ఆ వెంటనే వీళ్ళందరూ ప్రముఖ శ్రీపాంచరాత్ర ఆగమ శ్రీ వైష్ణవ క్షేత్రం సింహాచలం లోని శ్రీ వరాహ లక్ష్మి

నృసింహ స్వామిని దర్శించుకుని తిరిగి తమ ప్రాంతాలకు తరలి వెళ్తుండడం తోలి విడత పర్యటన ముగుస్తోంది.
అయితే రెండో విడత లో నైనా శాఖా సమీక్ష జరుగుతుందని అధికారులు, ప్రజలు  ఆశిస్తున్నారు.   
ఇలాగే కొనసాగితే మహా విశాఖ నగరం రాజధాని అవుతుందో లేదో తెలియదు కానీ మహా పుణ్యక్షేత్రంగా మారడం మాత్రం ఖాయంగా

కనిపిస్తోంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam