DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తూగో జిల్లా స్పందన లో డిఆర్ఓ, ఆర్డీవో అర్జీల స్వీకరణ

*(DNS Report : P Raja, Bureau Chief, Amaravati)*

*అమరావతి, ఏప్రిల్ 25, 2022 (డిఎన్ఎస్):* తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మొత్తం 120 ఫిర్యాదులు అందాయని డిఆర్ఓ బి. సుబ్బారావు పేర్కొన్నారు. సోమవారం  రాజమహేంద్రవరం లోని కలెక్టరేట్ లో స్పందన కార్యక్రమంలో ఆర్డీవో చైత్ర వర్షిణి తో కలిసి పిర్యాదులు

స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి బి. సుబ్బారావు మాట్లాడుతూ, ప్రజల నుంచి స్పందన లో వొచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, తదుపరి చర్యలపై శాఖల వారీగా సమీక్షించడం జరుగుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం డివిజన్, మండల, గ్రామ, వార్డు స్థాయి లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు

తెలిపారు. భూసంబంధ, రేషన్ కార్డులు, పింఛన్లు, ఇండ్ల స్థలాలు, ఇళ్ళు మంజూరు తదితర వాటికి సంబంధించిన పిర్యాదులు అందాయన్నారు. ప్రతి పిర్యాదు ని వ్యక్తిగతం తీసుకుని, మనస్సుతో స్పందించాలని కోరారు. కలెక్టరేట్ నిర్వహించిన స్పందనలో  ఆయా శాఖల జిల్లా  తదుపరి స్థాయి అధికారులు హాజరయ్యారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam