DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహాలో చాలీసా చదవడం రాజద్రోహమైతే, మేమూ చేస్తాం:దేవేంద్ర

*మహారాష్ట్రలో నవనీత్, రాణాల అరెస్ట్ పై భగ్గుమంటున్న బీజేపీ* 

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, ఏప్రిల్ 25 , 2022 (డిఎన్ఎస్):* మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా చదవడం రాజద్రోహం గా పరిణగిస్తూ మహారాష్ట్ర ఒక ఎంపీ, ఎమ్మెల్యే లను జైలు కు పంపడం అత్యంత దారుణమని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మండిపడ్డారు.

సోమవారం ముంబై లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే  రవి రాణా లు సీఎం ఇంటి ఎదురుగా హనుమాన్ చాలీసా చదువుతాం అని ప్రకటించగానే ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే వారిద్దరి అరెస్ట్ చేసి, రాజద్రోహం కేసు పెట్టడం భారత దేశ చరిత్రలోనే ఒక

దుర్దినంగా అభివర్ణించారు. చాలీసా చదవడమే ద్రోహమైతే మేము కూడా వేలాది మంది బీజేపీ కార్యకర్తలతో హనుమాన్ చాలీసా చదివి అదే ద్రోహం చేస్తామని, చేతనైతే అడ్డుకోవాలని సవాల్ విసిరారు. 

ఒక రిజర్వేడ్ విభాగానికి చెందిన మహిళా ఎంపీ ని అరెస్ట్ చేసిన విధానం సభ్య సమాజం సిగ్గు పడేలా ఉందన్నారు. ఆమెను రాత్రంతా ఒక సెల్ లో

బంధించి, తర్వాత రోజు కోర్టు లో హాజరు పరిచారని, కనీసం ఆమె త్రాగు నీరు ఇవ్వలేదని, సౌచాలయానికి కూడా వెళ్లనివ్వకుండా ఒక తీవ్రవాదిని చూసినట్టు పరిగణించారన్నారు. దీనిపై తాము కేంద్ర హోమ్ శాఖా కు ఫిర్యాదు చేశామన్నారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం దీనికి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసారు.   

మహారాష్ట్రలో ప్రభుత్వం

పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని తుంగలోకి తొక్కిందని, పోలీసులు కూడా అదే బాటలో వెళ్తున్నారని, తాము చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఎదుర్కోవడం తమకు తెలుసునన్నారు. కేరళలోని, పశ్చిమ బెంగాల్ లో పాలకుల తరహాలో మహారాష్ట్రలో పాలనా చేద్దామనుకుంటే చూస్తూ ఊరుకోమన్నారు. ఆ రాష్ట్రాల్లో వేలాది మంది తమ కార్యకర్లను హత్య చేసినా,

పోరాడుతూనే ఉన్నామని తెలిపారు.  దాని అర్ధం తమకు చేతగాక కాదన్నారు. అయితే రాజ్యాంగంపై తమకు గౌరవం ఉందన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam