DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజకీయ పార్టీలను కలగా పులగం చేయడమేనా పీకే లక్ష్యం. .

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, ఏప్రిల్ 26 , 2022 (డిఎన్ఎస్):* పీకే. . ప్రశాంత్ కిశోరె. .ఈ పేరు ప్రస్తుత రాజకీయ పార్టీల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. అయితే గతంలో ఇతను ఎన్ని పార్టీలతో పనిచేసినా. .  నేడు పార్టీలు ఇతని చుట్టూ తిరుగుతున్నాయి. ఒత్తిడి పెరుగుతుండడంతో చెయ్యవలసిన పనిని మరింత కంగాళీ చేసుకుని. .

పొలిటికల్ పార్టీలకు తోచిన అంచనాలతో సమీకరణాలు చేస్తున్నాడు. దీనిలో భాగంగానే ప్రస్తుతం విభిన్న ధృవాలుగా ఆన్న పార్టీలతో కూటమి అంటూ ప్రచారం చేయిస్తున్నాడు. 
గతం లో కాంగ్రెస్ తో విభేదించిన టి ఆర్ ఎస్, వైఎస్ అరే కాంగ్రెస్, సహా బీజేపీ యేతర పార్టీలన్నింటినీ కాంగ్రెస్ తో జతచేసి పనిలో పడ్డాడు.
ఇతను వేసుకున్న

ప్రణాళిక ఫలితం ఎలా ఉంటుందో తెలియదు కానీ. . .ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలను కలగా పులగం చేసి. . అసలు ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నారో జనానికే కాదు ఆ పార్టీ నేతలకే తెలియని పరిస్థితి తీసుకు వచ్చాడు. 

గతంలో ఇతని ప్రస్థానం నరేంద్ర మోడీ గుజరాత్ ఎన్నికల్లో మొదలైనప్పడికి నేడు బీజేపీ తో పూర్తి

స్థాయిలో విభేదాలు ఉండడంతో ప్రతిపక్షాలపై మోజు కంటే. . బీజేపీ పై వ్యతిరేకత తోనే ఇతను ప్లాను వేస్తున్నట్టు గా తెలుస్తోంది. దీని కి ప్రధాన కారణం బీజేపీ ద్వారానే రాజకీయ అరంగేట్రం చెయ్యాలి అనుకున్న ఇతన్ని బీజేపీ ఏమాత్రం ఇతన్ని ఖాతరు చెయ్యక పోవడమే ప్రధాన కారణంగా కనపడుతోంది. 
పీకే చేసే పార్టీల కలగా పులగం వల్ల

ప్రతిపక్షాలకు ఎంత మేలు జరుగుతుందో తెలియదు కానీ బీజేపీ కి ప్రధానంగా నరేంద్ర మోడీ కి బాగా కలిసి వచ్చే అంశంగానే విశ్లేషకులు భావిస్తున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam