DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దుర్గ గుళ్లో అపచారం పై శాఖపరమైన చర్యలు :ఈఓ  

*భక్తులపై శాఖాపరమైన చర్యలు ఎలా తీసుకుంటారు?*

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, ఏప్రిల్ 28 , 2022 (డిఎన్ఎస్):* విజయవాడ ఇంద్రకీలాద్రి పై వెలసిన శ్రీకనక దుర్గ ఆలయానికి బుధవారం దర్శనానికి నటుడు రామ్ చరణ్ వచ్చిన సమయంలో జరిగిన తోపులాటపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఈఓ భ్రమరాంబ ప్రకటించారు.

వివరాల్లోకి వెళితే. .

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో హీరో రామ్ చరణ్ వచ్చిన సంధర్భంగా అభిమానులు అత్యుత్సాహాన్ని పోయి ఆలయ హుండీలపై ఎక్కి నుంచొదన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. దీనిపై హిందూ సంఘాలు, భక్తుల నుంచి ఫిర్యాదులు రావడంతో దోషులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 

అయితే ఆలయంలో

హుండీలు, క్యూ లైన్లలో రైలింగ్ లపై నుంచున్న వారు, ఆలయంలోకి రాకూడని విధంగా వచ్చిన సందర్భం తదితర అంశాలను వివిధ దినపత్రికల్లో ప్రచురితం కావడం తో భక్తుల్లో, హిందూ సంఘాల్లో తీవ్రని ఆగ్రహం తలెత్తింది. తక్షణం సీసీ కెమెరాల్లో వీడియో చూసి, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. 

భక్తులపై శాఖాపరమైన చర్యలా

?

ఆలయంలో హుండీ ఎక్కిన వాళ్లపై  శాఖాపరమైన చర్యలు తీసుకుంటాము అని వ్రాసారు. హుండీ ఎక్కిన వాళ్ళు సాధారణ భక్తులు.    అంటే భక్తులపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకునే స్థాయికి దేవాదాయ శాఖా చేరుకుందన్న మాట. 

ఆ సంస్థ లో పనిచేసే ఉద్యోగుల మీద తీసుకునే చర్యలను శాఖాపరమైన చర్యలు అంటారు అని అందరికి

తెలిసిందే. 

అలాంటిది భక్తుల మీద శాఖాపరమైన చర్యలు ఎలా తీసుకుంటారు? అసలు శాఖాపరమైన చర్యలు తీసుకునే అధికారం దేవాదాయ శాఖా కు ఉందా?
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam