DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కొరోనా టైంలో కడుపు నింపిన మోడీ కి నోబెల్ ఇవ్వాలి: బిఎస్ఈ చీఫ్ 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 1, 2022 (డిఎన్ఎస్):* అత్యంత కీలకమైన కొరోనా మహమ్మారి విజృంభణ సమయంలో దేశ ప్రజలను ఆదుకున్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అత్యంత అరుదైన నోబెల్ పురస్కారం ఇవ్వాలని బోంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ సి ఈ ఓ ఆశిష్ కుమార్ చౌహాన్ కోరారు. ముంబై లో జరిగిన ఓ

సమావేశం లో అయన ఈ ప్రతిపాదన చేసారు. కోవిడ్ మహమ్మారి వేళ పేదలకు ప్రధాని మోడీ అండగా నిలబడ్డారన్నారు. ఉచిత ఆహార పథకం ద్వారా బియ్యం, గోధుమలు ఉచితంగా అందజేసి పేదల ఆకలి తీర్చారని ప్రశంసించారు. కోట్లాది మందికి ఉచిత ఆహార పథకాన్ని విజయవంతంగా అమలు చేశారని, ఇది ప్రపంచంలోనే అరుదైనదని కొనియాడారు. ప్రధాని మోడీ 80 కోట్ల మందికి ఉచిత

ఆహార పథకం అమలు చేస్తే, ఐక్య రాజ్యసమితి ప్రపంచ వ్యాప్తంగా కేవలం 11.5 కోట్ల మందికే ఉచిత ఆహారం అందజేశారని గుర్తు చేశారు. 
మోడీ పిలుపుతో రాజకీయ పార్టీలకు అతీతంగా సామాజిక కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వారియర్లు అద్భుతంగా పని చేసి, కోవిడ్ కట్టడికి సేవలు అందించారన్నారు. కోట్లాది మంది కడుపు నింపిన ప్రధానికి నోబెల్ బహుమతి

ఇవ్వడం సముచితమని అభిప్రాయపడ్డారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam