DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిన్నమూలవిరాట్ ఫోటో, నేడు వీడియో, రేపు లైవ్ కూడా ఇచ్చేస్తారా? 

*సింహాచలం లో అపచారం ఈఓ వైఫల్యమే వైష్ణవ సంఘాలు మండిపాటు*  

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 08, 2022 (డిఎన్ఎస్):* కోట్లాదిమంది హిందువుల ఇలవేల్పు సింహాచలం క్షేత్రం లో వేల్స్ వెలసిన శ్రీవరాహ లక్ష్మి నృసింహ స్వామి ఆలయంలో ఇటీవల జరిగిన చందన యాత్ర లో మూల విరాట్ ని  వీడియో

తీయడం పై శ్రీ వైష్ణవ సంఘాలు మండిపడుతున్నాయి. ఆగమ సంప్రదాయం ప్రకారం గర్భాలయంలో జరిగే ఉత్సవాలను ప్రత్యక్షంగా దర్శించాలి తప్ప సాంకేతిక పరికరాలతో చితీకరించడం పెద్ద అపచారం అని తెలియచేస్తున్నాయి. 

గతంలో మూల విరాట్ ను ఫోటో తీసి సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారని, నేడు మూల విరాట్ ను మొబైల్ లో వీడియో తీసి సోషల్

మీడియా లో పోస్ట్ చేసారని, రేపు వచ్చే రోజుల్లో స్వామిని ఏకంగా లైవ్ టెలికాస్ట్ ద్వారా ప్రసారం చేయిస్తారా అని సూటిగా ప్రశ్నిస్తున్నాయి. 

సింహాచల క్షేత్రం లాంటి అత్యంత ప్రతిష్ఠాత్మక దేవాలయంలో ఇలాంటి అపచారం జరిగిన  అపచారం పై తప్పిదానికి భాద్యత ఆలయ ఈఓ వైఫల్యం కారణంగానే ఈ తప్పిదం జరిగిందని

తెలియచేస్తున్నాయి.  ఆగమ సంప్రదాయం ప్రకారం ఆలయంలో అర్చకులు, పురోహితులు, స్థానాచార్యులు, హవాల్దార్, తదితర వైదిక సిబ్బంది ఉంటారని, వీళ్లందరి భాద్యత గర్భాలయంలో ఎటువంటి అపచారాలు జరగకుండా చూడడమే. అత్యంత  పవిత్రమైన వైశాఖ శుద్ధ తదియ ( అక్షయ తృతీయ ) నాడు ఒక్క రోజు మాత్రమే సింహాచలం క్షేత్రంలోని శ్రీవరాహ లక్ష్మి నృసింహ

స్వామి నిజాయరూపంలో భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. స్వామిని దర్శించేందుకు లక్షలాదిగా భక్తులు ఆలయానికి వస్తుంటారు. అయితే వీళ్ళందరికీ ఇబ్బంది లేకుండా, అపచారాలు జరుగకుండా ఉత్సవాన్ని నిర్వహించడం ఆలయ ఈఓ ప్రధాన భాద్యత. ఆమె తమ భాద్యతల్లో నిర్లక్ష్యం వహించిన ఫలితంగా గర్భాలయ దర్శనానికి వచ్చిన భక్తులు ఒకరు మూల

విరాట్ ను నేరుగా మొబైల్ ఫోన్ లో వీడియో తియ్యడమే కాక, సోషల్ మీడియా లో పోస్ట్ చెయ్యడంతో భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 
ఇప్పడికే సుప్రీం కోర్టు న్యాయమూర్తి కి ప్రోటోకాల్ అమలు చెయ్యలేదు అనే ఫిర్యాదు పై ఆలయ ఈఓ కు ఛార్జి మెమో ఇవ్వడం జరిగింది. దానికి ఆమె రాజకీయ ఒత్తిళ్ల వల్ల పొరపాటు జరిగి ఉండవచ్చు అనే

సమాధానం కూడా వ్రాసి పంపినట్టు సమాచారం. 

అయితే ఆలయం లో దర్శన ప్రోటోకాల్ కంటే అతి పెద్ద తప్పిదం ఆలయంలో వీడియో తియ్యడం. దీనిపై ఎవ్వరూ స్పందించక పోవడం చూస్తే. . .ఇది ఒక పధకం ప్రకారం తీయించారా అనే అనుమానం కూడా కలుగుతోంది అని భక్తులు మండిపడుతున్నారు. 

ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేసి, దోషులపై కఠిన చర్యలు

తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam