DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుపతి సంప్రదాయం పాఠశాల నుంచి నలుగురు బాలికలు పరార్

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 10, 2022 (డిఎన్ఎస్):* చిత్తూరు జిల్లా తొండవాడ లోని కె ఎం కె నగర్ లో గల సంప్రదాయ పాఠశాల నుంచి నలుగురు విద్యార్థినులు పారిపోయిన ఘటన పై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి పాఠశాల లో గోడదూకి వెళ్లిన

విద్యార్థులు పారిపోయినట్టు కళాశాల నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కళాశాల కంచి పీఠాధిపతి ఆధ్వర్యంలో నడుస్తున్న వేద పాఠశాల కావడం గమనార్హం. వందలాది మంది విద్యార్థినులు విద్యావంతులై ఉన్నత స్థితిలోకి చేరుకున్న చరిత్ర ఈ పాఠశాలకు ఉంది. కడప కు చెందిన ప్రశాంతి ,  విశాఖపట్నం కు స్రవంతి చెందిన ,

విజియనగరం కు చెందిన శ్రీవల్లి, విజయవాడ కు చెందిన విద్యాలక్ష్మి వర్షిణి లు కళాశాల నుంచి అర్ధరాత్రి బయటకు వెళ్ళిపోయినట్టు నిర్వాహకులు ఫిర్యాదు చేశారన్నారు.  వీరిలో నలుగురు విద్యార్థుల లో ఇరువురు మేనేజర్లు, ఇరువురు మైనర్లు కావడం గమనార్హం. వీరు  చంద్రగిరి సమీపంలోని శ్రీనివాస కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం

చదువుతున్నారు. ఇప్పటికే నాలుగు ప్రత్యేక బృందాలను ఆయా జిల్లాలకు పంపడం జరిగిందన్నారు. ఓ ప్రత్యేక బృందం తో విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు అధికారులు తెలిపారు. వెస్ట్ డిఎస్పి నరసప్ప విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam