DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచలం కు అంతర్జాతీయ స్థాయి ప్రచారం చేస్తామన్నారు గుర్తుందా? 

*ఈఓ గారూ. .దేవస్థానం పిఆర్ఓ తో కొంచెం వార్తలు వ్రాయించండి * 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 10, 2022 (డిఎన్ఎస్):* ప్రఖ్యాత శ్రీవైష్ణవ దివ్యక్షేత్రం సింహాచలం లో వెలసిన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తీసుకు వస్తానని ఆలయ ఈఓ గా

పదవి భాద్యతలు చేపట్టిన రోజున ఎంవి సూర్యకళ పత్రికా ముఖంగా చేసిన ప్రకటన ఇది. 

అయితే అది కొద్దీ రోజుల్లోనే ఆమె తన లక్ష్యానికి దాదాపుగా దూరమయ్యారని చెప్పాలి. ఆలయానికి విశ్వఖ్యాతి కల్పించేందుకు నెలకు రూ. 75 వేలు జీతాలు ఇచ్చి ప్రచారం కోసం ఇద్దరు సిబ్బంది ని నియమించారు. దానిలో ఒకరు పి ఆర్ ఓ కాగా, మరొకరు

ఫోటోగ్రాఫర్. ఈ ఇద్దరు తప్పితే ఆలయంలో మీడియా కెమెరాలను కూడా అనుమతించం అని ఖరాఖండీగా చెప్పేసారు. 

ఈ ప్రకటన చూసి అంతా నిజం కాబోలు అనుకున్నారు. సోషల్ మీడియా లో ఆలయ అకౌంట్ లు కూడా తెరిచారు. అవి కొన్ని రోజులు తూతూగా నడిచినా ఆ తర్వాత పడుకున్నాను. 

అయితే కేవలం మీడియా కెమెరాలను మాత్రమే అనుమతించం అని,

ఇతరులు తెచ్చుకున్న పెద్దగా పట్టించుకోము అన్నట్టుగా ఆలయ సిబ్బంది వైఖరి కనపడుతోంది. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే. . .ఈ నెల 3 న జరిగిన చందన యాత్ర రోజున స్వామి వారి నిజరూపాన్ని గర్భాలయంలోని మొబైల్ ద్వారా వీడియో తీసి, సోషల్ మీడియా లో పోస్ట్ చేసేసినా నేటికీ పట్టించుకునే ఠికాణా లేదు. 

అయితే అంతర్జాతీయ ఖ్యాతి

సంగతి దేవుడెరుగు. అసలు ఆలయం గురించి ప్రచారమే జరగడం లేదని భక్తులు మండిపడుతున్నారు. రూ. 50 వేలు తీసుకునే పి ఆర్ ఓ కొన్నాళ్ళు పనిచేసాక విధుల నుంచి తప్పుకున్నారు. నాటి నుంచి కొత్తగా మరో నూతన పి ఆర్ ఓ గా నియామకం జరిగింది. ఆ రోజు నుంచి ఆలయం గురించి వార్తలు వ్రాసే నాధుడే కనపడక పోవడం గమనార్హం. కేవలం ఫోటో రైటప్ లే తప్పితే. . .

ఆలయంలో జరిగే వైదిక ప్రక్రియ గురించి వివరించి మీడియా ప్రతినిధులకు అందించాల్సిన బాధ్యతలో ఉన్న వ్యక్తి పూర్తిగా బాధ్యతల పట్ల నిర్లక్ష్యం చేయడం తో. . .ఆలయంలో ఏమి జరుగుతోందో తెలియకుండా పోయింది. 

సింహాచల దేవస్థానం నుంచి కేవలం ఫోటోలు మాత్రమే విడుదల చేస్తూ. . .అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కావాల్సిన ఆలయ ప్రచారం

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారైంది. 

ఈఓ తానూ మీడియా ముఖంగా భక్తులకు ఇచ్చిన మాటను పూర్తిగా విస్మరించినట్టుగానే కనపడుతోంది. ఆమె ఆలయ  ప్రచారం పట్ల ఆమె ఏమాత్రం దృష్టి సారించక పోవడంతో ప్రచార సిబ్బంది ఆడింది ఆటగా, పడింది పాటా గా సాగుతోంది అని మీడియా వర్గాలు మండిపడుతున్నాయి. 

ఆలయానికి

దర్శనం కోసం వచ్చే ప్రముఖులు ఎవరో, వారి హోదా ఏంటో కూడా తెలియక పోవడం తో. .. కేవలం ఫొటోలో ఉన్న వ్యక్తులను తెలిసిన వరకూ వ్రాయడం, మిగిలినవి ప్రక్కన పెట్టడం తప్ప మీడియా చేయగలిగిందేమీ లేదు. 

దేవస్థానం నుంచి విడుదలయ్యే పత్రిక ప్రకటనల్లో ఈ రోజు కళ్యాణం జరిగింది. వీళ్ళు, వాళ్ళు వచ్చారు స్వగతం పలికారు. ఆశీర్వచనం

చేశారు.  అని మాత్రమే విడుదల వస్తున్నాయి తప్ప. . ఆలయం అభివృద్ధి కోసం జరుగుతున్నా కార్యాచరణ గానీ, ఆలయంలో జరుగుతున్నా వైదిక కార్యక్రమాలు గానీ. . ఒక్క అక్షరం కూడా అధికారిక సోషల్ మీడియా గ్రూప్ ల్లో కనపడడం లేదు. 

ఈఓ గారూ... ఆలయ అభివృద్ధి కోసం కేవలం ఈఓ ఒక్కరే పనిచేస్తే ఫలితం రాదు. క్రింద స్థాయి సిబ్బంది కూడా

సరిగ్గా పనిచేస్తేనే మీ శ్రమకు తగిన ఫలితం వస్తుంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam