DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చిన్నపిల్లల తల్లుల కోసం ప్రత్యేక బెర్తులు సిద్ధం చేసిన భారతీయ రైల్వే 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 10, 2022 (డిఎన్ఎస్):* 5 ఏళ్ళ వయసు లోపు పిల్లలతో రైళ్లలో ప్రయాణించే తల్లుల కోసం  భారతీయ రైల్వే ప్రత్యేక ' బేబీ బెర్త్ ' (పిల్లలకు సీట్లు) ప్రవేశపెట్టింది, వీటిని ఫిబ్రవరి 8 న మదర్స్ డే రోజున రైళ్లలో ప్రారంభించింది. చిన్నపిల్లలు తమ తల్లితో పాటు

ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రయాణించేందుకు వీలుగా ఇప్పటికే మహిళల కోసం కేటాయించిన లోయర్ బెర్త్‌లను బేబీ బెర్త్‌ల పక్కనే ఉంచారు. ప్రస్తుతం చిన్న పిల్లల కోసం ఈ కొత్త బెర్త్‌లను కొన్ని రైళ్లలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. ఈ బేబీ సీటుకు ఎటువంటి అదనపు ఛార్జి ఉండదు. ప్రస్తుతం లక్నో నుండి న్యూఢిల్లీకి వెళ్లే లక్నో

మెయిల్‌ లో త్రీ - టైర్ ఏసీ కోచ్‌లో రెండు బెర్త్‌లు జోడించబడ్డాయి. త్వరలో, బేబీ బెర్త్ సౌకర్యాన్ని ఇతర రైళ్లకు కూడా విస్తరింపజేయనున్నారు.

ఒంటరిగా ప్రయాణించే మహిళలు, గర్భిణులు మరియు ఐదేళ్లలోపు పిల్లలతో ప్రయాణించే మహిళలకు లోయర్ బెర్త్‌లను అందించడానికి రైల్వేలు ప్రయత్నాలు చేస్తున్నాయి.  దీనికోసం

లోయర్ బెర్త్‌తో పిల్లలకు సీటు కూడా మహిళలకు కేటాయించేలా ఏర్పాట్లు చేశారు. రైలు సీటుపై నుంచి చిన్నారి కిందపడకుండా రైల్వేశాఖ తగిన జాగ్రత్తలు తీసుకుంది.

రిజర్వేషన్ టిక్కెట్‌ను బుక్ చేసుకునే సమయంలో, ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల పేరును తప్పనిసరిగా పూరించాలి మరియు మహిళలకు బేబీ బెర్త్

అందుబాటులో ఉంచబడుతుంది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam