DNS Media | Latest News, Breaking News And Update In Telugu

57 రాజ్యసభ స్థానాలకు షెడ్యూలు విడుదల, ఏపీ నుంచి 4

*(DNS Report : P Raja, Bureau Chief, Amaravati)*

*అమరావతి, మే 12, 2022 (డిఎన్ఎస్):* పెద్దల సభకు మరోసారి విజయసాయి రెడ్డి వెళ్లనున్నారు. అయితే అధికారిక ప్రకటన విడుదల కావాల్సివుంది. దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ సీట్లకు ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్‌ విడుదల చేసింది.  
ఖాళీకానున్న రాజ్యసభ సీట్ల కోసం మే 24 న

నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు మే 31వ తేదీగా నిర్ణయించింది. జూన్ 1వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 3 వరకు గడువు ఉంటుంది. జూన్ 10న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.

మొత్తం 57 సీట్లలో..

ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి నాలుగు, తెలంగాణ నుంచి రెండు సీట్లు భర్తీ చేయాల్సి ఉంది.  ఏపీ నుంచి ఎంపీలు విజయసాయిరెడ్డి, సురేష్ ప్రభు, టీజీ వెంకటేష్, సుజనా చౌదరిల పదవీకాలం ముగియనుంది. అలాగే తెలంగాణ నుంచి కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు,  ధర్మపురి శ్రీనివాస్‌లు రిటైర్‌ అవుతున్నారు.

వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు

ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే అధికారికంగా ప్రకటన విడుదల కావాల్సివుంది. వారిలో వి. విజయసాయి రెడ్డి, బీద మస్తాన్ రావు, కిల్లి కృపారాణి, ఆదానీ ఉన్నట్టు తెలుస్తోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam