DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ కేంద్రంగా త్వరలో రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ సమాఖ్య ఏర్పాటు 

*(DNS Report : Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*

*విశాఖపట్నం, మే 13, 2022 (డిఎన్ఎస్):* బ్రాహ్మణ సంక్షేమం కోసం అలాగే  ఆర్థిక, రాజకీయ, సామాజిక అభివృద్ధి చెందేందుకు ప్రత్యేక ప్రణాళికతో ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ సమాఖ్య ఏర్పాటు చేయనున్నట్లు బ్రాహ్మణ సమాఖ్య ప్రతినిధి వడ్డాది ఉదయ కుమార్ తెలియజేశారు. శుక్రవారం విడుదల మీడియా తో మాట్లాడుతూ

ఆంధ్ర ప్రదేశ్ లో బ్రాహ్మణులు ఎంతో వెనుకబడి ఉన్నారని వారి పట్ల ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, బ్రాహ్మణ సంఘాలు కూడా ఉదాసీనంగా వ్యవహరించడంతో బ్రాహ్మణుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. 
సర్వేజనా సుఖినో భవంతు అని అందరిని దీవించే బ్రాహ్మణుల పరిస్థితి ప్రభుత్వాలు మారినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు

ఉందన్నారు. ఈ నేపథ్యంలో బ్రాహ్మణుల కోసం నూతన ఒరవడితో విశాఖలో త్వరలో రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ సమాఖ్య ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బ్రాహ్మణ సమాఖ్య పేరు బ్రాహ్మణ సమాఖ్య విధి విధానాలు, సమైక్య చేపట్టే కార్యక్రమాలు కొద్దిరోజుల్లోనే తెలియజేస్తామన్నారు. విశాఖలో వేలాది మంది బ్రాహ్మణులతో, బ్రాహ్మణ పెద్దలతో

సమావేశంనిర్వహించనున్నట్లు తెలియజేశారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam