DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏకంగా గుడి గోడ పైనే క్రైస్తవ ప్రచారమా ?

దేవుని దోచే (దేవా ధన దాహ ) శాఖ కళ్లుతెరిచేదెన్నడో ?

గుంటూరు, ఆగస్టు 9, 2018 (DNS Online ) : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో హిందూ ఆలయాలంటే అందరికీ లోకువగా మారిపోయాయి అనడానికి

మరో నిదర్శనం ఇది. గుంటూరు జిల్లా మాచర్లలోని 
ఓల్డ్ టౌన్ లో గల కన్యకా పరమేశ్వరి ఆలయ గోడలపై క్రీస్తు పోస్టర్లు అంటించి విద్వేషాలు రేకెత్తించే దుస్సాహసం

చేయగలిగారు అంటే ఈ రాష్ట్రం లో హిందువులకు, వారి సంప్రదాయాలకు ప్రభుత్వం ఎంత మేరకు విలువ ఇస్తోందో తెలుస్తోంది. గతం లో హిందూ ఆలయాల పరిసర ప్రాంతాల్లో ఈ క్రైస్తవ

మత ప్రచారం జరిగేది. ప్రభుత్వాలు, అధికారులు కళ్ళు మూసుకు పోయి, వాళ్ళ ప్రలోభాలకు లొంగిపోవడం, తదితర జాడ్యాలకు బానిసలు అవ్వడంతో ఇప్పుడు వీళ్ళు ఏకంగా హిందువుల

గుడి గోడలపైనే ఎక్కేసారు. దీనిపై పలువురు భక్తులు , హిందూ సంఘాలు వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పడికీ, స్థానిక రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు కనీసం

నోరు ఎత్తక పోవడం ఈ రాష్ట్రం లో హిందూ మనోభావాలకు సమాధి కట్టారు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం గా ఈ గుడి గోడ కనపడుతోంది. ఈ వివాదం ఉధృతం కావడం తో ప్రభుత్వం పరువు

పోతుంది అని భయపడి చర్యలు చేపడుతున్నామని ప్రకటన చేసి, ఈ ఆలయ గోడపై అంటించిన కరపత్రాన్ని చించేశారు. పైగా ఈ నిర్వాహకులకు అనుమతి ఇచ్చిన అధికారులు దీనికి

పూర్తిగా మద్దతు ఇచ్చినట్టే అని ఈ చర్యలే తెలియచేస్తున్నాయి. నగరం లో సభలు జరుపుకునేందుకు ముందుగా అనుమతికి దరఖాస్తు చేసుకోవాల్సియుంటుంది. అప్పుడు తెలియదా

వీళ్ళకి, ఇలా మరో మత సంప్రదాయ గుడి పై ఇలా పోస్టర్లు అంటించకూడదు అని. ఇదే హిందూ ఉత్సవాలు, జాతరలు, పండగలు, సభలకు సంబంధించిన ప్రచార పోస్టర్లు ఈ రాష్ట్రంలోని ఏ ఒక్క

చర్చి గోడపైనేనా à°…à°‚à°Ÿà°¿à°‚à°šà°¿ ఉంటె à°ˆ రాష్ట్రం ఇలాగ ఉండేదా అని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. 

తూతూ మంత్రంగా  à°šà±‡à°ªà°Ÿà±à°Ÿà±‡ చర్యల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని, మత

విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎవరు చేసిన చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక మత సానుభూతిపరులుగా నిలిచిపోవడం తోనే ఇలాంటి ఘటనలు ఈ రాష్ట్రం లో

పెచ్చుమీరిపోతున్నాయి అనడానికి ఇది తార్కాణంగా నిలుస్తోంది. ఎవరు ఇంకొకరి ప్రార్ధనా ప్రాంతాల్లోకి వచ్చి వాళ్ళ మత ప్రచారం చేసుకున్నా, లేదా ప్రచార ప్రయత్నం

చేసినా చర్యలు తీసుకునే చట్టాలను కఠినంగా అమలు చెయ్యాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో మైనారిటీలు గా ఉన్న వీళ్ళ ఆగడాలు మరింతగా పెచ్చుమీరిపోతాయి అని హిందూ

సంఘాలు మండిపడుతున్నాయి. విజయవాడలో 40  à°¹à°¿à°‚దూ గుళ్ళు నిర్దాక్షిణ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూల్చేసిన తర్వాత వీళ్ళ ఆగడాలు మరింతగా పెరిగిపోతున్నాయి అని

ఆక్రోశిస్తున్నాయి.

క్రైస్తవ ప్రచారకులు ఈ గుడి గోడలపై పోస్టర్లు అంటిస్తున్న సమయం లో హిందూ సంఘాలు అడ్డుకోకుండా ఏమి చేస్తున్నట్టు? అప్పుడు నిద్రపోయిన ఈ

సంఘాలు ఇప్పుడు à°°à°—à°¡ చెయ్యడం లో అర్ధం ఏంటి ? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam