DNS Media | Latest News, Breaking News And Update In Telugu

క్షేత్ర స్థాయిలో హిందూ ధర్మరక్షణకై నడుం బిగించిన విశాఖ శారదాపీఠం

*తిరుమలలో స్వధర్మ వాహినిసంస్థ కు స్వరూపానందేంద్ర ఆశీస్సులు* 
 
*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 15, 2022 (డిఎన్ఎస్):* సనాతన హిందూ ధర్మ రక్షణకై నిరంతరం శ్రమిస్తున్నవిశాఖ శ్రీ శారదా పీఠం తమ సేవలను క్షేత్ర స్థాయిలో మరింత విస్తృత పరిచేందుకు నడుం బిగించింది. ఆదివారం

తిరుమల శ్రీనివాసుని సాక్షిగా స్వధర్మ వాహిని పేరుతో నూతన ఆధ్యాత్మిక సంస్థ లోగోను పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, స్వాత్మానందేంద్ర స్వాములు ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి మీడియాతో మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణలో నూతన ఒరబడి సృష్టించేందుకే కొత్త

ఆధ్యాత్మిక సంస్థను ఏర్పాటు చేసామన్నారు. ఈ సంస్థ యువత ద్వారా వినూత్నంగా ధర్మప్రచారం సాగిస్తుందని తెలిపారు. ధర్మం అంటే పూజలు మాత్రమే కాదని, జ్ఞాన రాశి అని కూడా తెలిపేందుకు ఈ సంస్థ కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ధర్మ ప్రచారం పేరుతో చాలామంది ప్రవచనాలు, ఉపన్యాసాలకే పరిమితమవుతున్నారని, ఈ సంస్థ అందుకు భిన్నంగా

పనిచేస్తుందని వివరించారు. అన్యమత ప్రచారాన్ని నిలువరించేందుకు మారుమూల గిరిజన, హరిజన, గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి సారిస్తుందన్నారు. పసుపు, కుంకుమ, తెలుపు కలయికలతో స్వధర్మ వాహిని లోగోను రూపుదిద్దామని తెలిపారు. కల్మషాన్ని పోగొట్టేది పసుపు రంగు అయితే, తెలుపు ధర్మపధం వైపు నడిపిస్తుందని, కుంకుమ

జ్ఞాననేత్రానికి సంకేతమని వివరించారు. ఎంత కష్టమైనా విశాఖ శ్రీ శారదాపీఠం ధర్మపధం వైపే ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. స్వధర్మ వాహిని సంస్థ ద్వారా అద్భుతం సాధించాలన్న ఆలోచనతోనే శ్రీవారి పాదాల చెంత తిరుమలలో ఈ సంస్థను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam