DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సరైన ప్లానింగ్ లేకుండా చార్ధామ్ యాత్రకు వెళ్ళద్దు: ప్రేమ్ భగీరథ

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 15, 2022 (డిఎన్ఎస్):* ముందస్తు ప్రణాళిక సక్రమంగా చేసుకోకుండా చార్ ధామ్ యాత్రకు వెళ్ళవద్దు అని పర్యాటక పరిశోధకులు, సినీ దర్శకులు ప్రేమ్ భగీరథ హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పర్యాటక సీజన్ కావడంతో అధిక సంఖ్యలో తెలుగు ప్రజలు చార్ ధామ్ యాత్రకు

వెళ్తుంటారని, అయితే అక్కడ ప్రస్తుత వాతావరణ పరిస్తితులు బట్టి ప్రయాణపు ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలన్నారు. చార్ ధామ్ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, బదరీనాధ్, కేడర్ నాధ్ ఆలయాలను దర్శనం చేసుకోవడం జరుగుతుందన్నారు. 
యమునోత్రి వెళ్లేవారు ముందస్తుగా ప్రణాళిక చేసుకోవాలని, జానకి చట్టి ప్రాంతానికి రాత్రికి చేరుకునేలా

ప్రయాణం సిద్ధం చేసుకోవాలన్నారు. తర్వాత రోజు తెల్లవారుఝామునే యమునోత్రి దర్శనానికి బయలు దేరాలన్నారు. జానకి చట్టి నుంచి 6 కిలోమీటర్ల దూరం కొండల్లో ఉన్న యమునోత్రి ఆలయానికి చేరుకోడానికి నడక ద్వారా, గుర్రాల ద్వారా, డోలి ద్వారా వెళ్ళవచ్చన్నారు. 

ప్రస్తుతం వర్షాభావం ఉన్నందున వెలుతురూ సరిగ్గా ఉండదని, ఉదయం 5

గంటలకు బయలు దేరి వెళ్లి, తిరిగి  మధ్యాహ్నం 3 గంటల లోపు తిరిగి జానకి చట్టి చేరుకోవాలన్నారు. స్థానిక క్యాబ్ డ్రైవర్లు, లోకల్ గైడ్ లు ఇస్తున్న సూచనలు ఆ ప్రాంతం లోని వారికి అలవాటు ప్రకారమే ఉంటున్నాయి తప్ప, దక్షిణాది ప్రాంతం లోని వారికి ఇబ్బంది కరంగా ఉంటున్నాయన్నారు. 

తాము ముందురోజే జానకి చట్టి కు

చేరుకున్నామని, తర్వాత రోజు  ఉదయం 5 గంటలకు బయలు దేరే సమయానికి మేఘాలు దట్టంగా ఉన్నాయని, మధ్యాహ్నం 1 గంటలకు బయలు దేరి తిరిగి వెనక్కి వ బయలు దేరమన్నారు.  అయితే. . .తెలుగు పరంగా  ప్రాంతాల నుంచి వచ్చిన 10 కుటుంబాల వారు బార్ కోట్ ప్రాంతంలో రాత్రి నిలిచిపోయారని, అక్కడ నుంచి తర్వాత రోజు  ఉదయం 6 గంటలకు బయలు దేరి జానకి చట్టి

రావడం, ఆహారం తర్వాత బయలు దేరి యమునోత్రి కి వెళ్లడం జరిగిందన్నారు. అయితే అప్పడికి వర్షం భారీగా కురవడంతో నానా ఇబ్బందులు పడ్డారన్నారు. ఇలాంటి పరిస్థితి ఇతరులకు రాకూడదు అంటే  ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలన్నారు. 
యమునోత్రి , కేదార్ నాధ్ ప్రయాణం చాలా ప్రమాదకరమని, అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముందు రోజే తగిన

ఎర్పాట్లు చేసుకోవాలని, పర్యాటకుల నుంచి హోటళ్లు, ఆహారం, గుర్రాలు, డోలి లు అన్ని రకాలుగానూ  నగదు రెట్టింపు చార్జిలు వసూలు చేస్తున్నారని, యాత్రీకులు జాగ్రత్తగా ఉండాలన్నారు. 
 అయితే గంగోత్రి మార్గం సానుకూలంగా ఉంటుందన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam