DNS Media | Latest News, Breaking News And Update In Telugu

25 నుంచి షిర్డీ సాయి శత వత్సర సమాధి ఉత్సవాలు

విశాఖపట్నం, ఆగష్టు 10, 2018 (DNS Online): షిర్డీ సాయి బాబా మహా సమాధి చేరి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ నెల 25, 26 తేదీల్లో షిర్డీ సాయి శతాబ్ది మహోత్సవ ఉత్సవాలను

నిర్వహిస్తున్నట్టు విశాఖ జిల్లా షిర్డీ సాయిబాబా మందిరాల సేవా సమితి నిర్వాహక కమిటీ జిల్లా చైర్మన్ ఆదాల వేణుగోపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కర్రీ

అప్పిరెడ్డి, తెలిపారు. శుక్రవారం నగరం లో నిర్వహించిన విలేకరుల సమావేశం అయన మాట్లాడుతూ ఈ మహోత్సవాలు నగరం లోని ఎంవిపి కోలనీ లో గల ఏ ఎస్ రాజా మైదానం లో ఈ నెల 25 న

ప్రారంభం కానున్నాయన్నారు. à°ˆ కార్యక్రమం లో విశాఖ జిల్లాల్లోని 489  à°·à°¿à°°à±à°¡à±€ సాయి ఆలయాలు మందిర నిర్వహణ కమిటీలు సంయుక్తంగా పాల్గొంటున్నారని తెలిపారు. à°ˆ నెల 25 à°µ తేదీన

సాయంత్రం 4 గంటలకు విశాఖ నగరం లోని రామకృష్ణ బీచ్ నుంచి భారీ శోభాయాత్ర జరుగుతుందని, కేరళ వాయిద్యాలతో , మేళతాళాలతో, సంప్రదాయ కళారూపాలతో, ధింసా, ( బడిమెల, అరకు ) ,

తప్పెటగుళ్లు, కోలాటం, భజన బృందాలు వెంటరాగా భారీ షిర్డీ సాయి విగ్రహం ఊరేగింపుగా వేదిక వద్దకు చేరుకుంటుందని వివరించారు. ఈ శోభాయాత్రను ఆధ్యాత్మికవేత్తలు

à°—à°‚à°Ÿà°¾ శారదా, వెలగపూడి సృజన తదితరులు సాయికి హారతి ఇచ్చి ప్రారంభిస్తారన్నారు. ఉత్సవ కార్యక్రమాలు ఉదయం  à°²à°•à±à°·à±à°®à°¿ గణపతి హోమంతో మొదలై, కాకడ హారతి, భక్తులచే స్వయంగా

క్షీరాభిషేకం నిర్వహిస్తారని, తదుపరి ఆలయాల అర్చకులు వేదపారాయణ జరుపుతుండగా, సామూహిక సాయినామ సంకీర్తన, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ చేయడం జారుతుందని

తెలిపారు. యధావిధిగా నిత్యా హారతులు నిర్వహిస్తారన్నారు. à°ˆ నెల 26 à°¨ శ్రావణ పౌర్ణమి రోజు ఆదివారం  à°•à°¾à°µà°¡à°‚తో ప్రత్యేకించి, అత్యంత వైభవంగా à°ˆ ఉత్సవం

నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రముఖ ప్రవచన శిరోమణి, మహా సహస్ర అవధాని మాడుగుల నాగఫణి శర్మ చే సాయి వైభవం అనే అంశం పై సంగీత ప్రవచనం జారుతుందని, తదుపరి మధ్యాహ్నం

హారతి నిర్వహించి, సుమారు పదివేల మంది భక్తులకు చినవాల్టేర్ షిర్డీ సాయి ఆలయ వ్యవస్థాపకులు జివిఆర్ రెడ్డి, ఏ కె ఇ సి ప్రాజక్ట్ చీఫ్ మేనేజింగ్ డైరక్టర్ జి.

రాధాకృష్ణ ల సహకారం తో భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ జరుగుతుందన్నారు . ఈ ఉత్సవాల్లో పాల్గొనే ప్రతి భక్తునికి పంచముఖి రుద్రాక్ష, విభూది, నాణెం అందించడం

జరుగుతుందన్నారు. ఈ ఉత్సవ నిర్వహణ కమిటీ కి సంపూర్ణ సహకారం అందించిన సలహాదారులు సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణకు కమిటీ తరపున ధన్యవాదములు తెలియచేసారు. ఈ

విలేకరుల సమావేశం లో రాష్ట్ర కన్వీనర్ ముద్దా రంగారావు, తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam