DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వరాహ నృసింహునికి జూన్ 14 న మూడో విడత చందన సమర్పణ

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 25, 2022 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామికి జూన్ 14న మూడో విడతగా మూడు మణుగుల చందనాన్ని శాస్త్రోక్తంగా సమర్పించనున్నట్లు దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ

జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు  తెలిపారు. బుధవారం ఉదయం సింహాద్రి నాధుడునీ దర్శించుకున్న అనంతరం అయన  పాత్రికేయులతో మాట్లాడుతూ ఆయా కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు వివరించారు. జ్యేష్ఠ మాసం పౌర్ణమిని పురస్కరించుకొని ఆ రోజు మూడు మణుగుల చందనాన్ని స్వామికి శాస్త్రోక్తంగా సమర్పిస్తారన్నారు.  
/> ఇప్పటికే వైశాఖ శుద్ధ తదియ చందనోత్సవం రోజు రాత్రికి మూడు మణుగుల చందనాన్ని తొలివిడతగా స్వామికి సమర్పించగా, ఆ తర్వాత వచ్చే వైశాఖ పౌర్ణమికి మరో మూడు మనుగులు చందనము (ఇప్పటి వరకుమొత్తం 250 కేజీలు) స్వామికి సమర్పించినట్లు తెలిపారు. 
వచ్చే జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా జూన్ 14 న మరో మూడు మణుగుల చందనం సమర్పించడం జరుగుతుందని

,ఆ తర్వాత వచ్చే ఆషాడ పౌర్ణమికి మిగిలిన మూడు మణుగుల చందనాన్ని సమర్పిస్తారన్నారు.. ఏడాదిలో నాలుగు విడతలుగా  12 మణుగుల చందనాన్ని స్వామికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు,, ఆ తర్వాత వచ్చే శ్రావణ పౌర్ణమినీ  పురస్కరించుకుని కరాళ చందన సమర్పణ ఉంటుందన్నారు.
మూడో విడత కు అవసరమైన చందనాన్ని త్వరలోనే సిబ్బంది

అరగదీస్తారని  వివరించారు, సింహగిరి పై జరుగుతున్న ఆర్జిత సేవలకు భక్తులు నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు ప్రస్తుతం ఎనిమిది రకాల సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు,, నిత్యకల్యాణం, గరుడసేవ, లక్ష్మీనారాయణ వ్రతం, స్వర్ణపుష్పార్చన, స్వర్ణ తులసీదలార్చనతో పాటు అన్నప్రాసన ,అక్షరాభ్యాసం సేవలు అందుబాటులో ఉన్నట్లు

శ్రీను బాబు వివరించారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam