DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రూమర్లు వ్యాపించకుండా ఉండేందుకే ఇంటర్నెట్ apesaam  :తానేటి.

*(DNS రిపోర్ట్: పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మే 25, 2022  (డిఎన్ఎస్):* అమలాపురం సంఘటనపై డీజీపీ గారితో సమీక్షించడం జరిగిందని, రూమర్లు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం జరిగిందని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత తెలియచేసారు. ఘటన ప్రాంతాలను అదుపులో

ఉంచేందుకు ఆందోళనలు జరగకుండా అడిషనల్ డీజీ, డీఐజి, ఎస్పీ లను, అదనపు బలగాలను పంపించామన్నారు. అమలాపురంలో ఆందోళన పరిస్థితులను పోలీసులు అదుపులోకి తీసుకువచ్చారు. ప్రజలెవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరూ ధైర్యంగా ఉండొచ్చన్నారు. హింసకు పాల్పడిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో 7 కు పైగా కేసులు

ఉన్న వారిని 72 మందిని పోలీసులు గుర్తించారు. వీరిలో 46 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై దాడి చేసిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. శాసన సభ్యులు, మంత్రి గారి ఇళ్లపై ఆందోళనకారులు దాడి చేయడాన్ని, జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఇతర పోలీసులపై కూడా దాడి చేయడాన్ని  తీవ్రంగా

ఖండిస్తున్నామన్నారు.ఆందోళనకారులు దాడి చేస్తున్నప్పటికీ ఎదురుదాడి చేయకుండా పోలీసులు సంయమనం పాటించారు.  అమలాపురం ఘటనలో ప్రాణనష్టం జరగకుండా, ప్రజలకు, ఆందోళనకారులు ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిన్న పోలీసులు వ్యవరించిన తీరే ఫ్రెండ్లీ పోలీసింగ్ కు నిదర్శనం. పోలీసులను

అభినందిస్తున్నాను.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam