DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహానాడును అడ్డుకునేందుకు మహా ప్రయత్నాలు: బివి రామ్ 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 26, 2022 (డిఎన్ఎస్):* ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు సభను  అడ్డుకునేందుకు అధికార పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని మహా ప్రయత్నాలు చేస్తోందని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ మండిపడ్డారు. గురువారం ఉదయం తగరపువలస లో

నిర్వహించిన చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రశాంతంగా ఉండే కోనసీమ ప్రాంతంలో ఘర్షణలు దురదృష్టకరమని, హోం శాఖ మంత్రి తానేటి వనిత ప్రతిపక్ష పార్టీలపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని తప్పించుకునేందుకు ఈ ఘటనను టిడిపిపై నెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఈ దుర్ఘటన

ముమ్మాటికీ పోలీసులు, ప్రభుత్వం వైఫల్యమేనన్నారు. పచ్చటి పొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే ప్రత్యేక కోనసీమ భగ్గుమంది. దాడులు చేసిన వారు.. మంత్రి, ఎమ్మెల్యే ఇల్లును తగలబెట్టినవారు ఎవరో వీడియో రికార్డులో స్పష్టంగా కనపడుతున్నారు. ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరిగింది తప్ప అప్పటికప్పుడు జరిగింది కాదన్నారు.

ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం అని రామ్ అన్నారు.

ఈ నెల 27, 28 తేదీల్లో ఒంగోలులో జరగబోతున్న మహానాడు విజయవంతంగా కాకుండా ఉండేందుకు ప్రభుత్వం పలు రూపాల్లో అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ వచ్చేందుకు ఏర్పాటు చేసుకున్నబస్సులను సైతం అధికారుల హెచ్చరికలతో

అడ్డుకున్నారన్నారు. మహానాడు పై మీడియా దృష్టి మరల్చేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రుల చేత బస్సుయాత్ర నిర్వహిస్తోందని రామ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు, సమావేశాలు పెట్టుకునే హక్కు ఉంటుందని, జగన్మోహన్ రెడ్డి యాత్ర చేసే సమయంలో తెలుగుదేశం కూడా అలా అనుకుంటే పాదయాత్ర జరిగేదా? అని

ప్రశ్నించారు. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతద్వారా మహానాడుకు ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉందన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam