DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*కుటుంబ పాలన దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాద కరం: ప్రధాని మోడీ* 

తెలంగాణ ఇచ్చింది ఒక్క కుటుంబం కోసం కాదు జనం కోసం

*(DNS రిపోర్ట్: పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, మే 25, 2022  (డిఎన్ఎస్):* కుటుంబ పాలన దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని భారత  ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. భాగ్యనగరం పర్యటనలో ఉన్న ఆయన బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా

టీఆర్ఎస్ పాలనపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబాన్ని పాలించే వారు ద్రోహులని, టీఆర్‌ఎస్‌ పాలన అంతా అవినీతిమయమన్నారు.  కుటుంబ పాలన దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు. తెలంగాణ ఇచ్చింది ఒక్క కుటుంబం కోసం కాదని, యావత్ ప్రజానీకం కోసమన్నారు. తెలంగాణలో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలని

పిలుపునిచ్చారు.  తెలంగాణ భవిష్యత్తు కోసం పోరాడతాం అన్నారు. తెలంగాణలో మార్పు వస్తుందని ప్రధాని అన్నారు.  తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.  కుటుంబ పాలన అంతమయ్యే చోటే అభివృద్ధి జరుగుతుందన్నారు.  తెలంగాణలో కేంద్ర పథకాల పేర్లను మార్చి మార్చి అమలు చేస్తున్నామని ప్రధాని చెప్పారు.  కేంద్ర పథకాల

పేర్లను మార్చడం వల్ల ప్రజల మనసుల్లోంచి తొలగించలేమన్నారు.  పథకాల్లో రాజకీయాలు చేస్తే ప్రజలు నష్టపోతారని అన్నారు.  టీఆర్‌ఎస్ ఒక పార్టీకి బానిసగా పనిచేస్తుందని ప్రధాని మోదీ అన్నారు.  తాను మూఢ నమ్మకాలను నమ్మనని, టెక్నాలజీని నమ్ముతానని ప్రధాని చెప్పారు.  భారతదేశ సమైక్యత కోసం సర్దార్ పటేల్ ఎంతో కృషి చేశారని

ప్రధాని మోదీ అన్నారు.  తెలంగాణ టెక్నాలజీ హబ్‌గా ఎదుగుతోందన్నారు.  తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది అమరులయ్యారని, ఒకే ఆశయం కోసం వేల మంది బలిదానాలు చేశారని మోదీ అన్నారు.  తెలంగాణలో అమరుల ఆకాంక్షలు నెరవేరడం లేదని, కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయిందని అన్నారు.  తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్నదే తన ఆకాంక్ష

అని మోదీ చెప్పారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam