DNS Media | Latest News, Breaking News And Update In Telugu

29 న విశాఖ ఆర్కే మిషన్ లో యువతకు వ్యక్తిత్వ వికాస శిబిరం 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 26, 2022 (డిఎన్ఎస్):* శ్రీ రామకృష్ణ మిషన్ ఈ సంవత్సరం 125వ వ్యవస్థాపక దినోత్సవం లోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంలో, శ్రీ రామకృష్ణ మిషన్ ఆశ్రమ ప్రాంగణంలో ప్రతి ఆదివారం యువతకు వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలోని

సాగర తీరంలో గల  రామకృష్ణ బీచ్ రోడ్డు సమీపంలో ఉన్న, శ్రీ రామకృష్ణ మిషన్ ఆశ్రమ ప్రాంగణంలో వివిధ ముఖ్యాంశాలపై అవగాహనా సదస్సులు జరుగుతున్నట్టు సంస్థ ప్రతినిధి జి ఆర్ కె ప్రసాద్ తెలియచేసారు.  
స్వతంత్ర భారతదేశం యొక్క 75వ వార్షికోత్సవాన్ని కూడా పురస్కరించుకుంటూ ఆజాదీ కా అమృత మహోత్సవం జరుపుకుంటున్న తరుణం లో

వివేకానందుని అత్యంత ప్రీతిపాత్రమైన యువతకు మార్గనిర్దేశం చెయ్యాలని సంస్థ ఎన్నో కార్యక్రమాలను చేపడుతోందన్నారు.  

ఈ ఆదివారం మే 29 వ తేది న "జీవితంలో సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి" అనే అంశంపై ప్రత్యేక సదస్సును నిర్వహించనున్నారు. సంస్థ కార్యదర్శి స్వామి బోధమయానంద జీ, గ్లోబల్ ఎయిడ్ డైరెక్టర్, అడ్వకేట్ సాయి

పద్మ లు ఈ అంశంపై ప్రసంగించనున్నారు. ఈ శిబిరం లో పాల్గొనేందుకు 18 నుండి 35 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకులను ఆహ్వానిస్తున్నారు.

రిజిస్ట్రేషన్ తప్పనిసరి

ఈ సదస్సు లో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్ధులు మరియు యువ నిపుణులు పాల్గొనవచ్చు. రిజిస్ట్రేషన్ తప్పనిసరిగ చేసుకోవాలన్నారు. ఉదయం 9.30 గం. నుండి 12.00 గం.

వరకు సదస్సు జరుగుతుందన్నారు ఆసక్తి గల యువతి యువకులు మెయిల్ ఐడి ద్వారా వివేక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ (VIE)ని సంప్రదించవచ్చు: viekrm.vizag@gmail.com లేదా మొబైల్ నంబర్లో VIE కార్యాలయం. 8801304408. స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేయవచ్చు. మే 28 వ తేదీ గడువ లోపల మెయిల్ ద్వారా ముందుగా తెలియజేయడం తప్పనిసరి అని తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam