DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగన్, బాబులకు ఇతరులను సీఎం గా ప్రకటించే దమ్ము ఉందా?

*సామాజిక న్యాయం పై  వైకాపా, టిడిపి లకు ఎంపీ జివిఎల్ సవాల్* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 27, 2022 (డిఎన్ఎస్):* తమ కులం నుంచి కాకుండా ఇతరులను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే దమ్ము వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( వైఎస్సార్ కాంగ్రెస్ ), చంద్రబాబు నాయుడు (తెలుగు దేశం) లకు

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్శింహారావు బహిరంగ సవాల్ విసిరారు. శుక్రవారం విశాఖపట్నం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ఇటీవల కాలం లో సామాజిక న్యాయానికి తామే బ్రాండ్ అంబాసిడర్లు అని ప్రకటించుకుంటున్న వీళ్ళకి ధైర్యం ఉంటె ఇతరులను సీఎం అభ్యర్థులుగా ప్రకటించాలన్నారు. అదే బీజేపీ పార్టీ లో ఏ

సామాజిక వర్గం వారైనా ఏ పదవి అయినా చేపట్టగలరన్నారు. 
సర్పంచ్ నుంచి రాష్ట్రపతి పదవి వరకూ పార్టీలో గ్రామా స్థాయి పదవి నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుని వరకూ సైతం ఏ సామాజిక వర్గం లోని వారైనా పదవులు పొందగలరనడానికి ప్రత్యక్ష నిదర్శనాలు ఎన్నో ఉన్నాయన్నారు. కుటుంబ పాలన సాగిస్తూ సామాజిక న్యాయం అంటే మోసం చేయటం కాదా?

అన్నారు. 

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ భేరి పేరుతొ మంత్రులు ఒక బస్సు యాత్ర చేపట్టారని, ఆ బస్సులో ఉన్న మంత్రులకైనా కనీసం వారు ఏ శాఖా మంత్రో తెలుసా  అని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టటానికే ఏపిలో మంత్రుల సామాజిక న్యాయ బస్సు యాత్ర. వాళ్లు మంత్రలవగానే సామాజిక న్యాయం జరిగిపోతుందా?
/> అసలు బస్సెక్కిన మంత్రులకు తమ శాఖ ఏదో, అందులో ఏం జరుగుతోందో తెలుసా? ప్రజలకు కాదు కదా పత్రికల వారికి కూడా ఉప ముఖ్యమంత్రుల, వారి శాఖల పేర్లు తెలీని పరిస్థితి ఉందంటే ఆయా మంత్రులు ఎంత అనామకంగా తయారయారో అర్ధమవుతుందన్నారు. 

శ్రీకాకుళంలో బస్సు యాత్ర సందర్భంగా స్పీకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం.

రాజ్యాంగ పదవిలో ఉండి రాజకీయ విమర్శలు చేయరాదు.  వైకాపాలో అధికారం చెలాయిస్తున్న ముఖ్యమైన ఐదుగురి పేర్లు చెప్పమంటే అన్నీ ఒక సామాజిక వర్గానివే ఉన్నాయి. మిగతాదంతా ఉత్తుత్తి సాధికారతే. 

బిసి కార్పోరేషన్లు అన్ని కులాలకు పెట్టారుగానీ వాటికి నిధులు కాదు కదా కనీసం ఆఫీసులు లేవు. వాటికి బడ్జెటులో కేటాయించిన

అరకొర నిధులు కూడా నవరత్నాలకు తరలించేశారు.

కుటుంబ పాలన మీద పోరాడుతామని, అవినీతికి అంతం పలుకుతామని ప్రధాని మోదీజీ నిన్న తెలంగాణ పర్యటనలో అన్నారు. అది ఏపీకీ వర్తిస్తుందన్నారు. ఈ రాష్ట్రంలో బిజెపి జనసేన కలిసి సామాజిక న్యాయం సాధిస్తాయన్నారు.

దావోస్ లో ఏమి సాధించారు?
దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి

జగన్ ఏం సాధించారో చెప్పాలి. ఒక తెలంగాణ మంత్రి జగన్ అక్కడ దోమలు తోలుకుంటున్నారని వ్యాఖ్యానిస్తే ఇక్కడినుంచి ఒక్క ఖండన ఇవ్వలేకపోయారు. పైగా వాళ్లిద్దరే దావోస్ లో చెట్టా పట్టాలేసుకు తిరిగారన్నారు. ఏపీ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. దీన్ని క్రేన్లు, బుల్డోజర్లూ కూడా పైకి ఎత్తలేవని సామాన్యులకు సైతం అర్ధమైంది.

/>  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam