DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్ర ఉపముఖ్యమంత్రుల పేరు చెబితే బహుమానం: జివిఎల్

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 27, 2022 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రజలెవరైనా సరే రాష్ట్ర ప్రభుత్వంలోని ఉప ముఖ్యమంత్రుల పేర్లు తడుముకోకుండా, గూగుల్ తల్లిని అడక్కుండా, చెప్పగలరా అని, చెప్పగలిగితే ఒక మంచి బహుమానం తో సత్కరిస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్

నర్శింహారావు బహిరంగ సవాల్ విసిరారు. శుక్రవారం విశాఖపట్నం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ రాష్ట్రంలో మంత్రులు ఎవరో, వాళ్ళ పేర్లు ఏంటో జనానికి తెలియకుండా పోయిందని, ఇక మంత్రులకైతే వాళ్ళకి ఇచ్చిన మంత్రిత్వ శాఖలు ఏంటో కూడా తెలియదన్నారు. ఉప ముఖ్యమంత్రుల పేర్లు తడుముకోకుండా విలేకరుల సమావేశంలో

చెప్పిన వాళ్ళకి పురస్కారం ఇస్తామన్నారు. అయితే ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ఉన్నారని, రాష్ట్రంలో పాలనా పూర్తిగా బ్రష్టుపట్టిందన్నారు. అవినీతి ఏ స్థాయిలో పేరుకు పోయిందంటే. . . యుపిలో అసాంఘిక శక్తులను అరికట్టేందుకు బుల్ డోజర్లను వాడుతున్నారని, అయితే ఆంధ్రాలో బుల్ డోజర్ల ద్వారా అదుపు చేసే స్థాయి ఏనాడో దాటిపోయిందన్నారు.

ఆర్ధికంగా దోపిడీ జరుగుతోందన్నారు. 

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ భేరి పేరుతొ మంత్రులు ఒక బస్సు యాత్ర చేపట్టారని, ఆ బస్సులో ఉన్న మంత్రులకైనా కనీసం వారు ఏ శాఖా మంత్రో తెలుసా  అని ప్రశ్నించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam