DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చంద్రబాబు రావాలి... రాష్ట్రం బాగుపడాలి: తెలుగుశక్తి బివి రామ్ 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం / ఒంగోలు, మే 27, 2022 (డిఎన్ఎస్):* యువత భద్రత కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం చంద్రబాబు రావాలి అప్పుడే రాష్ట్రం బాగుపడుతుందని రామ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును శుక్రవారం ఉదయం ఒంగోలులో

మహానాడు ప్రాంగణంలో తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ స్వాగతం పలికారు.  క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో మళ్లీ స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేవరకు ప్రతి ఒక్క కార్యకర్త శ్రమించాలని మహానాడులో రామ్ పిలుపునిచ్చారు. జాతిని తాకట్టు పెట్టి పదవులు తెచ్చుకునే నాయకులు కాదు

మనకు కావాల్సింది... జాతి కోసం పదవులను తృణప్రాయంగా వదులుకునే నిజాయితీ గల నాయకులు కావాలి అని రామ్ అన్నారు.
జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని ప్రజల భవిష్యత్తును అంధకారం లోకి నెట్టివేశారని రామ్ చంద్రబాబుకు తెలిపారు. రాబోయే 2024 ఎన్నికల్లో యువతకు 40 శాతం టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తాం అని

చెప్పిన చంద్రబాబుకు రామ్ కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని రామ్ ధీమా వ్యక్తం చేశారు. 

ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, 28న బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని, వారిని అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎక్కడికక్కడ ప్రయత్నాలు

చేస్తోందన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam