DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైకాపా బస్సులో అలీబాబా 40 మంది దొంగలు వస్తున్నారు: అచ్చెన్నాయుడు

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 27, 2022 (డిఎన్ఎస్):* అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్రలో వచ్చేది అలీబాబా 40 మంది దొంగలు అని తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ప్రదేశ్రా ష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఒంగోలు లో ప్రారంభమైన మహానాడు సభ వేదిక పై

పార్టీ క్యాడర్ నుద్దేశించి  ఆవేదన ప్రసంగం చేసారు. రానున్న ఎన్నికల్లో తెదేపా కచ్చితంగా గెలిచితీరుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆ గెలవడం మామూలుగా ఉండకూడదని.. 160 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి చంద్రబాబును సీఎం చేయాల్సిన అవసరముందని చెప్పారు. ఈ విషయంలో తెదేపా కార్యకర్తలపై గురుతర

బాధ్యత ఉందన్నారు. ఒంగోలులో నిర్వహిస్తున్న తెదేపా 'మహానాడు'లో అచ్చెన్నాయుడు మాట్లాడారు. ప్రజల హృదయాల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశమని చెప్పారు. ఈ మూడేళ్లలో జగన్‌ రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. బలహీనవర్గాల్లో 80 శాతం మంది తెదేపాతో ఉన్నట్లు సీఎంకు ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్ఉ ఉండటంతోనే వైకాపా మంత్రులు బస్సు

యాత్ర చేపట్టారని చెప్పారు.
ఆ బస్సుయాత్రలో వస్తోంది అలీబాబా 40 మంది దొంగలని అచ్చెన్న వ్యాఖ్యానించారు. మూడేళ్లలో ఏం చేశారని బస్సుయాత్రలో మంత్రులను ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చంద్రబాబు అందజేస్తున్న పథకాలను ఎత్తేశారని.. వాటన్నింటిపైనా నిలదీయాల్సిన బాధ్యత మనపై ఉందని

చెప్పారు. అధికారం ఉన్నా.. లేకున్నా నిరంతరం ప్రజల మధ్య ఉండే పార్టీ తెదేపా అన్నారు. 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి విపరీతమైన స్పందన వచ్చిందని చెప్పారు. తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. చంద్రబాబు సీఎం అయ్యాక ఒకే ఒక్క సంతకంతో ఆ కేసులన్నీ తీసేస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా

అధికారంలోకి రావడం ఖాయమని.. తెలుగుదేశం పార్టీని జగన్‌ ఏమీ చేయలేరని అచ్చెన్నాయుడు అన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam