DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తమ్మినేని స్పీకర్ హోదాకే కళంకం తెచ్చాడు, పదవికి అనర్హుడు :బివిరామ్  

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 28, 2022 (డిఎన్ఎస్):* చట్ట సభలో సభాపతి హోదా లో ఉన్నవ్యక్తి సంయమనం పాటిస్తూ నిష్పక్షపాతంగా వ్యవహరించే వ్యక్తి అని.. కానీ ప్రస్తుత శాసనసభ స్పీకర్  తమ్మినేని సీతారాం స్పీకర్ లా కాకుండా గోడలకి పార్టీ జెండాలు అంటించుకుని కార్యకర్తలా

 మాట్లాడుతున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు  నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా శనివారం విశాఖపట్నం సాగర తీరం లోని ఎన్టీఆర్ విగ్రహానికి  రామ్ ఘన నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం పై

నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ వల్ల కాడు పార్టీ అని వ్యాఖ్యానించిన తమ్మినేని సీతారాం అంటాను కూడా అదే పార్టీ నుంచి రాజకీయ జీవితం మొదలు పెట్టాడన్న విషయం మరిచిపోయినట్టు ఉన్నదన్నారు. 
అసెంబ్లీ లో స్పీకర్ గా ఉన్న వ్యక్తి అధికార పార్టీ తోనూ, ప్రతిపక్ష పార్టీ తోనూ ఒకేలా వ్యవహరించాల్సి ఉండగా, తమ్మినేని అధికార

పార్టీ కార్యకర్తలా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తమ్మినేని ని తక్షణమే స్పీకర్ పదవి కి రాజీనామా చేసి, ఆ తర్వాత నోటికి వచ్చిన ప్రేలాపన చేసుకోవచ్చన్నారు. 

రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమని.. ఆ సుదినం కోసం  ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికలలో చంద్రబాబు

నాయుడు ముఖ్యమంత్రిగా మళ్లీ బాధ్యతలు స్వీకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 
ఒకవైపు మంత్రులు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీల పేరుతో చేస్తున్న బస్సు యాత్రకు స్పందన ఏపాటిదో అందరికీ తెలుసునన్నారు. రాజమండ్రిలో కుర్చీలు ఖాళీ అయ్యాయని రామ్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడుకు

ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ఏది ఏమైనా  స్పీకర్ తమ్మినేని తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలని రామ్ హెచ్చరించారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam